Thursday, April 16, 2026
spot_img
Home Blog Page 3

Ias rinkusingh | పని లేకుంటే జీతం తీసుకోలేను.. రాజీనామా ఆమోదించండి.. రాష్ట్రపతికి ఓ ఐఏఎస్ నివేదన!

0

Ias rinkusingh | స‌ర్కారు కొలువంటే ఆషామాషీ కాదు.. అదీ సివిల్స్ అయితే చెప్ప‌న‌క్క‌ర లేదు.. ఏళ్ల పాటు పుస్త‌కాల‌తో య‌జ్ఞం చేయాల్సిందే. ఎన్నో వ‌డ‌పోత‌ల త‌ర్వాత కానీ నెర‌వేర‌దు ఆ క‌ల. అలాంటి ఉన్న‌తోద్యోగాన్ని సైతం త‌న‌కు వ‌ద్దంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు ఈ యువ ఐఏఎస్‌. తాను విధులు నిర్వ‌హించ‌కుండా వేత‌నం తీసుకోలేనంటూ జాబ్‌కే రాజీనామా చేశాడు. ఆమోదించాలంటూ ఏకంగా రాష్ట్ర‌ప‌తికి లేఖ రాసి దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాడు. ఆయ‌నే యూపీ కేడ‌ర్ కు చెందిన యువ ఐఏఎస్ రింకూసింగ్ రాహి.

అసలేం జరిగిందంటే..

  • 2023 బ్యాచ్‌కు చెందిన ఈయ‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని షాజాహాన్‌పూర్ జిల్లా పువాయా ప‌ట్ట‌ణ సబ్ కలెక్టర్ గా ఏడాది క్రితం నియామకమయ్యారు. ఈ క్రమంలో ఒక లాయర్ రోడ్డుపై మూత్ర విసర్జన చేస్తుండగా అతడిని గుంజీలు తీయించారు. న్యాయవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆయన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆయన వారిని పిలిచి మాట్లాడారు. అయితే నగరంలో పారిశుద్ధ్యంతోపాటు టాయిలెట్ల నిర్వహణ సరిగా లేదనివారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏకీభవించిన ఆయన బాధ్యత వహిస్తూ వారి ముందు స్వయంగా గుంజీలు తీయడం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో అతడిని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూబోర్డుకు అటాచ్ చేసింది.

ఎనిమిది నెల‌లుగా పోస్టింగ్ లేదు..

  • ఈ క్రమంలో 8 నెలలుగా పోస్టింగ్ లేదు. విధులు లేకపోవడంతో తాను వేతనం తీసుకోవడం సరికాదని భావించిన ఆయన రాజీనామాకు ఉపక్రమించారు. లేఖను రాష్ట్రపతికి నివేదించారు.సీనియ‌ర్ ఉన్నతాధికారు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.మరోవైపు విషయాన్ని ఆలీఘడ్ లో ఆయన కుటుంబం బుధవారం మీడియా ఎదుట వెల్లడించింది. నిజాయితీ గల అధికారికి న్యాయం చేయాలని కోరింది.
  • స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పేరు
  • ఈయిన గతంలో ముజఫర్ నగర్ లో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా పని చేశారు. ఆ సమయంలో భారీ కుంభకోణాన్ని బయట పెట్టారు. దీంతో అతనిపై దాడి కూడా జరిగింది. అయినా అదే పంథా కొనసాగిస్తూ తన మార్కును చూపుతుండడం గమనార్హం.

Kavitha Vijayashanthi : ఉద్యమ గొంతుకలు ఒకటవుతాయా.. ‘బతుకమ్మ’తో రాములమ్మ జత కట్టేనా?

ఖుల్లంఖుల్లా: kavitha vijayashanthi :తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని ఒకరు..పోరు బిడ్డలను విస్మరిస్తున్నారని మరొకరు ‘మండలి’ వేదికగా గొంతెత్తారు. ఇందులో ఒకరు జాగృతి అధ్యక్షురాలు కవిత కాగా మరొకరు కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి. ఇప్పటికే కవిత బీఆర్ఎస్ వీడి సొంత కుంపటిని సిద్ధం చేసుకుంటుండగా.. ఫైర్ బ్రాండ్ రాములమ్మ తాజాగా సొంత పార్టీ పైనే విమర్శనాస్త్రాలు సందించడం ఆసక్తికరంగా మారింది. ఈ ఇద్దరు ఒక్కతావుతారా.. తెలంగాణ రాజకీయాల్లో మహిళా శక్తిని చాటుతారా.. అనేది ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ గా మారింది.

ఇద్దరూ ఉద్యమకారులే..

తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మతో ప్రస్థానం ప్రారంభించిన కవిత ఇటీవల జరిగిన తాజా పరిణామాల నేపథ్యంలో సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఎమ్మెల్సీగా రాజీనామా చేసిన అనంతరం మండలి వేదికగా చేసిన ఆమె చివరి ప్రసంగం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా తాను ప్రస్తుతం ‘ఒక వ్యక్తిగా బయటకు వెళ్తున్నానని.. బలమైన శక్తిగా తిరిగి చట్టసభల్లోకి వస్తానని’ శపథం చేసిన విషయం విధితమే. అనుకున్నట్లుగానే ఆమె తన రూట్ మ్యాప్ ను కూడా సిద్ధం చేసుకుంటున్నారు. ఈనెల 25న పార్టీ ప్రకటన చేస్తానని ఇప్పటికే ఆమె వెల్లడించారు కూడా. ఇందులో భాగంగా జాగృతి శ్రేణులతో పాటు కలిసి వచ్చే నేతలతో ఆమె పూర్తిస్థాయిలో సంప్రదింపులు చేస్తున్నారు.

విజయశాంతి రాజకీయ ప్రస్థానం

సినీ రంగంలో లేడీ అమితాబ్ గా పేరుగాంచిన విజయశాంతి రాజకీయ అరంగేట్రం 1998లో బీజేపీతో మొదలైంది. తెలంగాణ ఉద్యమ సమయంలో 2005లో ‘తల్లి తెలంగాణ’ పార్టీ ప్రారంభించిన ఆమె అనంతరం టీఆర్ఎస్ లో విలీనం చేశారు. ఆ పార్టీతో కలిసి కొంతకాలం పనిచేసిన ఆమె 2009లో మెదక్ ఎంపీగా ఎన్నికయ్యారు. ఏమైందో ఏమో 2013లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నావంటూ విజయశాంతి పై గులాబీ బాస్ సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఆమె 2014లో కాంగ్రెస్ లో చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో మెదక్ నుంచి పోటీ చేసి ఓటమి పాలైన తర్వాత కొంతకాలం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తిరిగి 2020లో కమలం గూటికి చేరువయ్యారు. అక్కడ ఇమడలేక 2023లో హస్తం పార్టీలో చేరారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న ఆమె తాజాగా మండలి వేదికగా కాంగ్రెస్ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. ఉద్యమకారులకు న్యాయం చేయాలని సొంత ప్రభుత్వం పైనే విమర్శనలు ఎక్కు పెట్టడం ఆసక్తి కలిగిస్తుంది.

కవితమ్మతో రాములమ్మ కలిసి నడుస్తారా

ఉద్యమ ఆకాంక్షలే లక్ష్యంగా తెలంగాణ ప్రజా జాగృతి పేరిట కవిత కొత్త పార్టీని త్వరలో ప్రారంభించనున్న నేపథ్యంలో విజయశాంతి మండలిలో తాజాగా చేసిన ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ప్రాతినిధ్యం పెరగనున్న క్రమంలో తాజా పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి నడుస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాగా,రాష్ట్రంలో సొంత ఇమేజ్ కలిగి ఉన్న ఈ ఇద్దరూ బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ కు గురి అయిన వారూ కావడం గమనార్హం.

దీనిని కూడా చదవండి : కళ్ల ముందున్నా.. కలవనంత దూరమాయే! తండ్రి ఆజ్ఞ.. బిడ్డ ప్రతిజ్ఞ..ఆ తల్లికి మాత్రం తప్పని క్షోభ!

Surya Vamshi : రికార్డులతో మెరుస్తున్న సూర్యవంశి

ఖుల్లంఖుల్లా: surya vamshi : వైభవ్ సూర్యవంశి.. ప్రస్తుతం క్రికెట్లో మారుమోగుతున్న పేరిది. ఐపీఎల్ సీజన్ ప్రారంభంలోనే తన సత్తా చేటాడు ఈ బుగ్గ చెంపల బుడ్డోడు. మొన్ననే 15 ఏట అడుగుపెట్టిన ఈ యువబాల క్రికెటర్ పై ఓ లుక్కేద్దామా మరి.
కుటుంబ నేపథ్యం..
సూర్యవంశి 2011 మార్చి 27న బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లా తాజ్పూర్ లో జన్మించాడు. తండ్రి సంజీవ్, తల్లి ఆర్తి. తాను కాకపోయినా తన కుమారుడిని ఎలాగైనా క్రికెటర్ చేయాలన్నది ఆ తండ్రి ఆకాంక్ష. ఈ క్రమంలో నాలుగేళ్ల వయసులోనే సూర్యవంశికి క్రికెట్ ఓనమాలు నేర్పించాడు. తొమ్మిదవ ఏట అకాడమీలో జాయిన్ చేశాడు. ఇందుకోసం తన భూమిని సైతం అమ్మాడు. నాన్న ఆశయానికి అనుగుణంగా 12 ఏళ్ల వయసులోనే బీహార్ తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అడుగు పెట్టాడు సూర్య వంశీ.
ఐపీఎల్ అరంగేట్రం..

  • సూర్య వంశీ ఎడమచేతి బ్యాటర్. బంతి ఎలా వచ్చినా బౌండరీ దాటించడమే తన లక్ష్యం. కళ్ళు చెదిరే సిక్సర్లతో విరుచుక పడడం తన నైజం.14 ఏళ్ల ప్రాయంలోనే ఐపీఎల్ లోకి అడుగు పెట్టాడు ఈ చిన్నోడు. అతి చిన్న వయస్కుడిగా(14 ఏళ్ల 23 రోజుల) రికార్డు సృష్టించాడు. రాజస్థాన్ రాయల్స్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఆ సీజన్ లో గుజరాత్ టైటాన్స్ పై 35 బంతుల్లో శతకం (సెకండ్ ఫాస్టెస్ట్ సెంచరీ) సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన విషయం విధితమే. 2025 సీజన్ లో మొత్తం ఏడు మ్యాచ్ లు ఆడిన ఈ లెఫ్ట్ హ్యాండర్ 252( 24 సిక్సులు, 18 ఫోర్లు) పరుగులు సాధించాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ(century), ఒక సెంచరీ ఉన్నాయి. మొత్తం 36 సగటుతో 206.56 స్ట్రైక్ రేట్ ఉండడం గమనార్హం.
  • ప్రస్తుత ఐపీఎల్ (ipl)సీజన్లో చెన్నై తో జరిగిన తొలి మ్యాచ్లోనే 15 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసి తన విధ్వంసకర బ్యాటింగ్ తీరును మరోసారి చాటాడు. మునుమందు మరిన్ని రికార్డులు సొంతం చేసుకునేందుకు ఉవ్విల్లూరుతున్నాడు. మనం కూడా ఆల్ ద బెస్ట్ చెబుదామా మరి.

Kavitha Party : తెలం’గానం’.. కలిసొచ్చేనా ‘జాగృతి’కి జనం హారతిచ్చేనా?

kavitha party | జై తెలంగాణ.. నాడు పది జిల్లాల నినాదం. స్వరాష్ట్ర సాధన కోసం సబ్బండ వర్గాలను ఐక్యం చేసిన వజ్రాయుధం. మలి దశ పోరుతో సిద్దించిన దశాబ్దాల స్వప్నం. జనం ఆకాంక్షకు అద్దం పట్టేలా ఆ పేరుతో పుట్టిన ఉద్యమ పార్టీకి కలిసాచ్చింది కూడా. రెండు పర్యాయాల ఏలుబడే నిదర్శనం. సీన్ కట్ చేస్తే.. మళ్లీ అదే సెంటిమెంట్ తో రాష్ట్రంలో మరో పార్టీ పురుడు పోసుకునేందుకు రంగం సిద్ధమైంది. దీనికి నేతృత్వం వహిస్తున్నది ఎవరో కాదు.. మలిదశ ఉద్యమ పితగా పేరుగాంచిన కేసీఆర్ తనయ. తాజాగా కవిత కొత్త పార్టీతో జనం ముందుకు రాబోతున్నారు. నవమి రోజున స్వయంగా జాగృతి అధ్యక్షురాలు విషయాన్ని ప్రకటించగా.. జనం హారతి ఇచ్చే తీరు ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
బతుకమ్మ తో మొదలైన ప్రస్థానం..
కవిత రాజకీయ ప్రస్థానం బతుకమ్మ(bathukamma) తోనే మొదలైంది. ఉద్యమ సమయంలో ఈ ప్రాంత అస్తిత్వానికి ప్రతీకగా నిలిచే పూలసింగిడికి ఆమె పూర్వ వైభవం తీసుకొచ్చారు. జాగృతి వేదికగా పోరు బాట పట్టి ఉయ్యాల పాటలను ఊరురా మారు మోగించారు. ఢిల్లీ పెద్దలతో నాటి ఉద్యమ నేతను సమన్వయపర్చడంలో కీలక పాత్ర పోషించారు. స్వరాష్ట్ర సాధనలో తనకంటూ ఓ పేజీని లిఖించుకున్నారు.
రాజకీయ అరంగేట్రం
మెట్టినిల్లు అయిన నిజామాబాద్ నుంచి ఎంపీగా పొలిటికల్ అరంగేట్రం చేసిన కవితకు రెండోసారి మాత్రం చేదు అనుభవం ఎదురయింది. ఎమ్మెల్సీగా వచ్చిన అవకాశం చివరకు రాజీనామాతో బ్రేక్ పడింది.
బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి
రెండోసారి ఓటమి వైఫల్యాలపై లేఖాస్త్రం సంధించిన ఆమెపై అధిష్టానం కన్నెర్ర జేసింది. సస్పెన్షన్ వేటువేయగా.. అంతే దీటుగా ఆమె రాజీనామాస్త్రాన్ని ప్రయోగించారు. రాజకీయ శక్తిగా తిరిగి వస్తానని మండలిలో ప్రతీనభూనారు. నాటి ఉద్యమ పాఠాలతో జనం బాట పట్టారు. సర్కారు తీరును ఎండగడుతూనే కన్నీటికి తోడయ్యారు. బాధితులకు భరోసాగా నిలిచారు.
జైలుకెళ్లి..తిరిగొచ్చాక
లిక్కర్ కేసులో జైలు(jail) కెళ్లిన ఆమె తాజాగా కోర్టు తీర్పు వచ్చాక సత్యమేవ జయతే అంటూ నినదించారు. తాను ఏ తప్పు చేయలేదని.. చేయబోనని స్పష్టం చేశారు. కక్ష సాధింపు చర్యలకు తాను బలయ్యానని చెప్పుకొచ్చారు. సామాజిక తెలంగాణ తన లక్ష్యమని.. రాజకీయ పార్టీగా వచ్చి సాధిస్తానని పిడికిలెత్తారు.
kavitha party | ఇందూరు నుంచి కీలక ప్రకటన
తన అత్తగారిల్లు అయిన నిజామాబాద్ నుంచి నవమి రోజున తన పార్టీపై కవిత కీలక ప్రకటన చేశారు. సస్పెన్స్ కు తెరదీస్తూ వచ్చేనెల 25న హైదరాబాద్ వేదికగా పార్టీ విధి విధానాలు ప్రకటిస్తానని వెల్లడించారు.
తెలంగాణ ప్రజల గొంతుకగా..
తెలంగాణ ప్రజా గొంతుకగా.. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా.. ఇంటి పార్టీగా రాబోతున్నామని అన్ని వర్గాల ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకోవాలని కోరారు. ఏప్రిల్ 25న పార్టీ పేరు, విధి విధానాలు ప్రకటిస్తామని వెల్లడించారు.

నిన్న వెలుగుమట్ల.. నేడు ఔట్ సోర్సింగ్.. సమస్యల దారిలో ఆ ఇద్దరు!

ఖుల్లంఖుల్లా : kavitha, vishardhan| సమస్య ఏదైనా.. బాధితుల పక్షాన తామంటూ ముందుకు సాగుతున్నారు ఆ ఇద్దరు. ఇందులో ఒకరు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(kavitha), మరొకరు ధర్మ సమాజ్‌ పార్టీ వ్యవస్థాపకులు విశారదన్‌ మహరాజ్‌.

kavitha, vishardhan| వెలుగుమట్లలో..
* ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో భూదాన్ భూముల బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కవిత, విశారదన్ ఇటీవల ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. ఇళ్ల కూల్చివేతను నిరసిస్తూ నిరాహార దీక్షకు దిగారు. అరెస్ట్ కూడా అయ్యారు. ఆయా వర్గాల నుంచి ఒత్తిడి పెరగడంతో ప్రభుత్వం స్పందించింది. బాధితులకు టోకెన్లు జారీ చేయడంతో వారు ఆందోళన విరమించారు.

kavitha, vishardhan| ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం
* తాజాగా ఇందిరా పార్క్ వద్ద ఆదివారం నిర్వహించిన ఔట్ సోర్సింగ్(outsourcing) ఉద్యోగుల జేఏసీ ధర్నాకు వీరిద్దరూ మద్దతు తెలిపారు. వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. రెండు రోజుల్లోగా ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యోగులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఇలా ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ ఇరువురు ఆందోళన బాట పడుతున్నారు. బాధితులకు అండగా ఉంటూ జనం గొంతుకగా నిలుస్తున్నారు. పరిష్కారం పై భరోసా కల్పించేలా చొరవ చూపుతున్నారు. ఈ క్రమంలో మరికొన్ని వర్గాలు వీరిని ఆశ్రయించే అవకాశం లేకపోలేదు. కాగా, కొత్తగా పార్టీ పెట్టనున్న కవితకు ఇది ఎంతవరకు మైలేజ్ ఇస్తుందో చూడాలి మరి.

కళ్ల ముందున్నా.. కలవనంత దూరమాయే! తండ్రి ఆజ్ఞ.. బిడ్డ ప్రతిజ్ఞ..ఆ తల్లికి మాత్రం తప్పని క్షోభ!

Even though they are in front of our eyes..

ఖుల్లంఖుల్లా : Kavitha new party |ఆ తండ్రికి గారాల పట్టి.. బిడ్డకు కూడా డాడీ అంటే అంతే ప్రాణం. ఏమయిందో ఏమో.. వారి మధ్య ఎడబాటు పెరిగింది. అగాధంగా మారింది. దగ్గరే ఉన్నా కదలని పెదవులు. తప్పని మౌనం. ఆ కనురెప్పల మాటున దాగిన కన్నీటి సంద్రం వారికి మాత్రమే తెలుసు. ఆ పెద్దాయన బీఆర్ఎస్ అధినేత కాగా ఆమె కల్వకుంట్ల కవిత.
Kavitha new party | అసలు ఏమైంది
ఉద్యమ నేత కేసీఆర్ (kcr)కు కవిత అంటే పంచ ప్రాణాలు. స్వయంగా ఆయనే ఓ ఇంటర్వ్యూలో ప్రకటించిన విషయం విధితమే. ఆమె కూడా అంతే. పెళ్లయినా ఇంటిపేరు మార్చుకోకుండా తన తండ్రి పై ఉన్న మమకారాన్ని ‘కల్వకుంట్ల’గా సుస్థిరపరుచుకున్నారు. నాన్న ఆశీర్వాదంతో బతుకమ్మతో మొదలైన ఆమె ప్రస్థానం తొలి ప్రయత్నంలోనే పార్లమెంటులోకి అడుగులు పడ్డాయి. తన వాగ్దాటితో తెలంగాణ గోడు వినిపించడమే కాదు.. నిధులు రాబట్టడంలోనూ సక్సెస్ అయ్యారు. తండ్రికి తగ్గ తనయురాలుగా అందరి మన్ననలూ అందుకున్నారు. అయితే మలి ప్రయత్నం.. ‘కలిసి’ రాలే. ఒంటరిగా మారిన ఆమెకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు ఉద్యమ నేత.
Kavitha new party | రాజకీయ కక్షలకు బలి?
సీన్ కట్ చేస్తే.. దేశ రాజకీయాల్లోనూ చక్రం తిప్పాలనే భావనతో 2022 డిసెంబర్ 22న బీఆర్ఎస్ గా మారిన గులాబీ పార్టీకి అప్పటి నుంచే రాజకీయ ఇబ్బందులు మొదలయ్యాని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేంద్ర సర్కారు పావులు కదిపిందనే విమర్శలున్నాయి. రాజకీయ కక్షలో భాగంగానే తన బిడ్డపై లిక్కర్ కేసు తెరపైకి తెచ్చారని స్వయంగా కేసీఆరే ప్రకటించిన విషయం తెలిసిందే. తన బిడ్డ కడిగిన ముత్యం వలే త్వరలోనే వస్తుందని చెప్పిన ఆయన మాట ఇటీవలే అక్షరసత్యం అయింది కూడా.
Kavitha new party | మూడోసారి చేజారిన అధికారం
దాదాపు పదేళ్ల పాటు అధికారంలో కొనసాగిన ఆ పార్టీకి సాధారణంగా కొంత వ్యతిరేకత ఉండడం మామూలే. అయితే అభ్యర్థులను ఎక్కువగా మార్చకుండా బరిలో నిలవడం, ప్రత్యర్థుల హామీలను పట్టించుకోకపోవడం తదితర కారణాలతో మూడోసారి గులాబీ పార్టీకి కొంత ప్రతికూల ఫలితాలు వచ్చాయి. 2023లో అధికారం కోల్పోయాక అందరిలో ఒక్కసారిగా నిస్తేజం. వెంటనే వచ్చిన పార్లమెంట్ లోనూ ఊహించని ఫలితాలు వారిని మరింత నిరాశకు గురి చేశాయి. ఈ క్రమంలోనే కవిత రాసిన లేఖ లీకై రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది. ‘తన తండ్రి దేవుడని.. చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ’ ఆమె చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. ఇలా మొదలైన గ్యాప్ క్రమంగా పెరుగుతూ వచ్చింది. చివరకు క్రమశిక్షణ పేరిట తండ్రి ఆజ్ఞగా.. సస్పెన్షన్ వేటుకు దారి తీసింది. అయితే కవిత కూడా అంతే దీటుగా స్పందిస్తూ రాజీనామాస్త్రాన్ని సంధించారు. రాజకీయ శక్తిగా తిరిగి వస్తానంటూ సాక్షాత్తు పెద్దల సభలో ప్రతిన భూని జనం బాట పట్టారు. ప్రజల గొంతుక గా మారి బాధితుల పక్షాన పిడికిలెత్తుతున్నారు.
Kavitha new party | కొత్త పార్టీ వైపు అడుగులు
సామాజిక తెలంగాణ లక్ష్యంగా కొత్త పార్టీ వైపు తన అడుగులు ఉంటాయని ఇప్పటికే స్పష్టం చేసిన కవిత (kavitha) తాజాగా నిజామాబాద్ వేదికగా ఆ ప్రకటన కూడా చేశారు. ఇప్పుడు అందరి దృష్టి ఏప్రిల్ 25పైనే ఉంది.
Kavitha new party | ఎదుగుతున్నట్లా…ఎదురు తిరిగినట్లా?
కన్నబిడ్డ ఓ పార్టీ పెట్టే స్థాయికి ఎదిగిందని సంతోషపడాలా.. తండ్రి ఆజ్ఞను దిక్కరించిందని బాధపడాలో తెలియని విచిత్ర పరిస్థితి ఆ అమ్మది. గుండెల్లో దాగిన ప్రేమను చూపలేక ఆ తండ్రి మౌనంగా రోదిస్తున్నారా.. తనను బహిష్కరించిన కన్న ప్రేమను నిత్యం గుర్తుకు చేసుకుంటూ ఆ బిడ్డ క్షణక్షణం కన్నీటి పర్యంతమవుతుందా.. అనేది ఆ ముగ్గురికే తెలుసు. కాలం కరుణిస్తే మళ్లీ అందరూ ఒక్క చోటుకు చేరుతారా.. లేదా ఎప్పటికీ ప్రత్యర్థులుగానే ఉండిపోతారా వేచి చూడాల్సిందే.

ఇది కూడా చదవండి : ‘క’దిలే.. ‘వి’రాటంలో.. ‘త’పోవనమై

సీట్లు పెరుగుతున్నాయోచ్.. ఎమ్మెల్యే,ఎంపీ కావాలనుకునే వారికి గుడ్ న్యూస్..!

0
assembly and parliament Seats are increasing.. 

రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారా.. అయితే మీకో శుభవార్త.. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న లోక్ సభ స్థానాలు 543 నుంచి 816కు పెరగనున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు 4,123 నుంచి 6185కు పెరగనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

  • తెలంగాణలో ప్రస్తుతం17 లోకసభ స్థానాలు ఉండగా కొత్తగా మరో తొమ్మిది పెరగనున్నాయి. వీటితో కలిపి 26కు చేరే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న 119 స్థానాలకు మరో 60 జతకానున్నాయి. దీంతో మొత్తం 179కి పెరగనున్నాయి.
  • ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే.. ఇక్కడ లోక్‌సభ స్థానాలు ప్రస్తుతం 25 ఉన్నాయి. కొత్తగా 13 పెరిగే అవకాశం ఉంది. దీంతో మొత్తం స్థానాల సంఖ్య 38కి చేరనుంది. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే ప్రస్తుతం 175 ఉండగా కొత్తగా మరో 85 పెరగనున్నాయి. వాటితో కలిపితే మొత్తం స్థానాలు 263కు చేరువకానున్నాయి.
    వారిలో ఆశలు
  • ఇప్పటివరకు టికెట్ దక్కని వారు, పొలిటికల్ రంగప్రవేశం చేయాలనుకునేవారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా ప్రకటనతో అలాంటి వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. అప్పుడే తమకు అనుకూలంగా ఉండే ప్రాంతాలపై ఫోకస్ పెడుతున్నారు. పార్టీల ముఖ్య నేతల టచ్ లోకి వెళ్తున్నారు. ఈసారి తమను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని విన్నవించుకుంటున్నారు. స్థానాలు పెరిగితే ఒక్క అవకాశం కల్పించాలని కోరుతున్నారు.

పార్లమెంటులో ‘సామాన్య’ గొంతుక.. రాఘవ

0
రాఘవ చడ్డా.. ఈ పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో మారుమోగుతుంది. పార్లమెంటులో సామాన్య గొంతుకగా ప్రతిధ్వనిస్తోంది. చిన్న వయసులోనే రాజకీయ అరంగేట్రం చేసి అందరి మన్ననలు అందుకుంటున్న ఆప్ ఎంపీపై లుక్కేద్దామా మరి. 

రాజకీయ అరంగేట్రం

  • ఆమ్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు.
  •  2015లో పార్టీ జాతీయ కోశాధికారిగా నియమితుడయ్యారు.
  • 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఆప్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.
  • 2020లో జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో రాజిందర్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా అసెంబ్లీలోకి అడుగుపెట్టారు.
  • 2020 మార్చి 2న ఢిల్లీ జల్ బోర్డు ఉపాధ్యక్షుడిగా నియమితుడయ్యారు.
  • 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల ఇన్చార్జిగా పార్టీ గెలుపులో కీలకపాత్ర పోషించారు. ఈ క్రమంలో పార్టీ ఈయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. 2022 మార్చి 21నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు.
  • అత్యంత పిన్న వయస్కుడైన పార్లమెంటేరియన్లలో ఒకరిగా గుర్తింపు పొందారు.

సామాన్యుని గొంతుకగా ప్రశ్నలు సంధిస్తూ..

  • పార్లమెంటులో సామాన్యుడు గొంతుకగా పన్ను మినహాయింపులు, టెలికాం డేటా క్యారీ-ఫార్వర్డ్ వంటి ప్రజా సమస్యలను లేవనెత్తి అందరి దృష్టిని ఆకర్షించాడు. అందులో కొన్ని ప్రశ్నలు ..
  • 28 రోజుల వ్యాలిడిటీపై..: టెలికాం కంపెనీలు తమ ప్లాన్లను ‘మంత్లీ’ అని చెప్పి కేవలం 28 రోజుల వ్యాలిడిటీ మాత్రమే ఇస్తున్నాయి. దీంతో వినియోగదారులు సంవత్సరానికి 12 సార్లు కాకుండా 13 సార్లు రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. ఇది సామాన్యులపై భారం కాదా అని ప్రశ్నించారు.
  • డేటా క్యారీ ఫార్వర్డ్: ఒక రోజులో వాడకుండా మిగిలిన డేటాను తర్వాత రోజుకు బదిలీ చేసే సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు.
  • ఇన్ కమింగ్ కాల్స్ కొనసాగింపుపై: రీఛార్జ్ గడువు ముగిసిన తర్వాత కూడా కనీసం ఏడాది పాటు ఇన్కమింగ్ కాల్స్ ఎస్ఎంఎస్ వంటి సదుపాయం ఉండాలని సూచించారు.
  • టోల్ టాక్స్ రద్దుపై: వాహనం కొనేటప్పుడే రోడ్ టాక్స్, ఇతర పన్నులు చెల్లిస్తున్న వాహనదారుల నుంచి మళ్లీ టోల్ టాక్స్ పేరిట వసూలు సరికాదన్నారు. ఈ విషయంలో మధ్యతరగతి కుటుంబాలకు ఊరటనిచ్చేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
  • ప్రభుత్వ ఉద్యోగాల కోసం పరీక్షలు ఉన్నప్పుడు, రాజకీయ నాయకులకు ఎందుకు ఉండకూడదని ప్రశ్నించి చర్చకు తెర లేపారు.
  • ప్రజాప్రతినిధులు పనిచేయకుంటే పదవీకాలం ముగియకముందే తొలగించే హక్కు(right to recall) ఓటర్లకు ఉండాలని ప్రతిపాదించారు.

స్టాండింగ్ కమిటీ సభ్యడిగా..

రాజ్యసభలో ఆర్థిక శాఖకు సంబంధించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో సభ్యుడిగా కొనసాగుతున్నారు.

అవార్డులు..

  • ప్రపంచ ఆర్థిక వేదిక WEF నుంచి ‘యంగ్ గ్లోబల్ లీడర్’గా గుర్తింపు.
  • ఇండియా-UK అవుట్‌స్టాండింగ్ అచీవర్ అవార్డు.

‘బంగారు’ మాట.. ఇదే మంచి సమయయా.. మించినా దొరకదా!

  • The word ‘golden’… is this a good time?… పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావం బంగారం, వెండి ధరలపై పడుతోంది. వరుసగా తొమ్మిది రోజు తగ్గడం పరిస్థితికి అద్దం పడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్స్‌ ధర సోమవారం నాలుగు నెలల కనిష్టానికి చేరువైంది. తాజాగా 4,138 డాలర్లకు దిగివచ్చింది. 10 గ్రాముల 24 క్యారెట్ల ధర 1,36,650 పలికింది. ముందు రోజుతో పోల్చితే రూ.10,320 మేర తగ్గింది. మరోవైపు వెండి ధర కూడా కిలో రూ.2.30లక్షలకు చేరింది. ముందు రోజుతో పోల్చితే రూ.20వేలు తగ్గడం గమనార్హం.
    రికార్డు స్థాయి నుంచి కిందికు..
    ఈ ఏడాది జనవరి 29, 2026న పుత్తడి 10 గ్రాములకు రూ.1,93,096 రికార్డు స్థాయి పలికింది. తాజా ధరతో పోల్చితే 33శాతం పైగా పడిపోవడం గమనార్హం. వెండి ధర ఈ ఏడాది జనవరి 29న కిలో రూ.4.25 లక్షలు పలకగా ప్రస్తుత ధరతో పోల్చితే ఏకంగా 45శాతం పైగా తగ్గంది.
    యుద్ధ విరమణ ప్రకటనతో ..
    అయితే సాయంత్రం యుద్ధానికి ఐదు రోజులపాటు బ్రేక్ వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటన నేపథ్యంలో రాత్రి 8 గంటల సమయంలో మళ్లీ ధర పెరగడం గమనార్హం. పది గ్రామ పుత్తడి ఏకంగా రూ. 10 వేల వరకు పెరిగి రూ.1.46 లక్షలకు చేరువైనది. వెండి కూడా కిలో మరో రూ.2వేలు పెరిగి రూ.2.32లక్షలకు ఎగబాకింది. రానున్న రోజుల్లో ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే.

చేతులు జోడించి చెబుతున్నా.. దయచేసి ఆ నూనెలు.. చక్కెర వాడకండి.. ఓ డాక్టర్ ఆవేదన

 

  • తన దగ్గరకు వచ్చిన పేషంట్లతో ఓ డాక్టర్ కన్నీటి పర్యంతమైన ఘటన ఇది. ఆరోగ్యానికి హాని చేసే రిఫండ్ ఆయిల్, చక్కెర వంటివి వాడకూడదని క్యాన్సర్ వంటి రోగాలను కొనితెచ్చుకోవద్దంటూ చేతులు జోడించి చెప్పిన వైద్యుని గురించి ఓ సారి తెలుసుకుందాం పదండి.
    ఎక్కడంటే..
    * కరీంనగర్ లోని టైం న్యూరో కేర్ కు చెందిన వైద్యుడు విక్రమ్ సింగ్ ఠాకూర్ తన వద్దకు వచ్చిన పేషంట్లతో ఇటీవల కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలో రిఫండ్ ఆయిల్,షుగర్ వాడకంతో వచ్చే దుష్పరిణామాలను వివరించాడు. తాను చూసిన పేషెంట్స్ లో ఎక్కువగా కనిపించిన సమస్యలను వారి ముందు ఉంచాడు. ఆ కష్టాలు పగవారికి కూడా రావొద్దంటూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురి అయ్యాడు. కన్నీటిని ఆపుకోలేకపోయాడు. ఇకనైనా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ద వహించాలన్నాడు. గానుగ నూనె , నెయ్యి వాడాలని.. పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు, ఫోన్లు ఇవ్వవద్దని.. బయట ఫుడ్ కు దూరంగా ఉండాలని సూచనలిచ్చాడు. అలాగే ఎప్పుడూ తినడం కూడా ఓ రోగమని అందుకే పొట్టలు వస్తున్నయని.. మిత ఆహారం శ్రేయస్కరమని పేర్కొన్నాడు.
  • సోషల్ మీడియాలో చక్కర్లు..
    * ఆరోగ్యం పై అప్రమత్తంగా ఉండాలంటూ ఈ వైద్యుడి సూచనలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.