Thursday, April 16, 2026
spot_img
Home Blog Page 4

చేతులు జోడించి చెబుతున్నా.. దయచేసి ఆ నూనెలు.. చక్కెర వాడకండి.. ఓ డాక్టర్ ఆవేదన

 

  • తన దగ్గరకు వచ్చిన పేషంట్లతో ఓ డాక్టర్ కన్నీటి పర్యంతమైన ఘటన ఇది. ఆరోగ్యానికి హాని చేసే రిఫండ్ ఆయిల్, చక్కెర వంటివి వాడకూడదని క్యాన్సర్ వంటి రోగాలను కొనితెచ్చుకోవద్దంటూ చేతులు జోడించి చెప్పిన వైద్యుని గురించి ఓ సారి తెలుసుకుందాం పదండి.
    ఎక్కడంటే..
    * కరీంనగర్ లోని టైం న్యూరో కేర్ కు చెందిన వైద్యుడు విక్రమ్ సింగ్ ఠాకూర్ తన వద్దకు వచ్చిన పేషంట్లతో ఇటీవల కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలో రిఫండ్ ఆయిల్,షుగర్ వాడకంతో వచ్చే దుష్పరిణామాలను వివరించాడు. తాను చూసిన పేషెంట్స్ లో ఎక్కువగా కనిపించిన సమస్యలను వారి ముందు ఉంచాడు. ఆ కష్టాలు పగవారికి కూడా రావొద్దంటూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురి అయ్యాడు. కన్నీటిని ఆపుకోలేకపోయాడు. ఇకనైనా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ద వహించాలన్నాడు. గానుగ నూనె , నెయ్యి వాడాలని.. పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు, ఫోన్లు ఇవ్వవద్దని.. బయట ఫుడ్ కు దూరంగా ఉండాలని సూచనలిచ్చాడు. అలాగే ఎప్పుడూ తినడం కూడా ఓ రోగమని అందుకే పొట్టలు వస్తున్నయని.. మిత ఆహారం శ్రేయస్కరమని పేర్కొన్నాడు.
  • సోషల్ మీడియాలో చక్కర్లు..
    * ఆరోగ్యం పై అప్రమత్తంగా ఉండాలంటూ ఈ వైద్యుడి సూచనలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

‘వేరా’యే!

0

ప్రకృతిలో ఎన్నో చిత్రాలు దర్శనమిస్తాయి. చూసే కోణంలో ప్రత్యేకతను సంతరించుకుంటాయి. సాధారణంగా చెట్టు వేర్లు భూమి అంతరభాగంలో ఉంటాయి. ఇక్కడ మాత్రం బాహ్యంగా కనిపిస్తున్నాయి. చుట్టూ పచ్చదనం, గుట్టలు తోడవడంతో మరింత ఆకర్షణీయంగా మారాయి. హుస్నాబాద్ మండలం మహ్మదాపూర్ లో గల ఓ పొలం వద్ద కనిపించిన ఈ దృశ్యం ‘వేరు’గా ఉంది కదూ.

హోర్ముజ్.. ‘సంధి’ చిన్నది.. రవాణా పెద్దది



హోర్ముజ్(straight of Hormuz ).. పశ్చిమాసియాలోని ఇరాన్ ఒమాన్ ల మధ్య ఉన్న ఇరుకైన జల సంధి. ఇప్పుడిది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. దాదాపు నాలుగు వారాలుగా కొనసాగుతున్న యుద్ధానికి కేంద్రబిందువుగా నిలుస్తోంది. ఇజ్రాయిల్, అమెరికా దాడులను దీటుగా ఎదుర్కొంటున్న ఇరాన్ ఈ ప్రాంతాన్ని మాత్రం తనకు ఆయువు పట్టుగా మార్చుకుంది. క్రూడాయిల్ రవాణా వ్యవస్థను శాసిస్తుంది. యావత్ ప్రపంచాన్ని హెచ్చరిస్తుంది.

జలసంది విశేషాలివి..

  • పర్షియన్ ఒమన్, గల్ఫ్ ఒమన్ ను కలుపుతూ హిందూ మహాసముద్రానికి అనుసంధానించే కీలక మార్గం.
  • పొడవు సుమారు 167 కిలోమీటర్లు. అత్యంత ఇరుకైన వెడల్పు 33 కిలోమీటర్లు.
  • ఈ మార్గం గుండా నిరంతరం వందలాది నౌకలు రాకపోకలు సాగిస్తుంటాయి. లోనికి, బయటకు వెళ్లేందుకు రెండు ప్రత్యేక మార్గాలు ఉంటాయి. ప్రతీ రూట్ వెడల్పు దాదాపు రెండు నాటికల్ మైళ్ళు. వీటి మధ్య బఫర్ జోన్ మరో రెండు నాటికల్ మైళ్ళు  ఇలా మొత్తంగా 10 కిలోమీటర్ల మేర మార్గం రూపొందించబడింది.
  • ట్రాఫిక్ నియంత్రణ కోసం ఇక్కడ టీఎస్ఎస్(ట్రాఫిక్ సపరేషన్ స్కీం)ను అమలు చేస్తారు.
  • ఈ మార్గంలో ప్రతిరోజు సగటున 21 మిలియన్ బ్యారెల్స్ (అంటే సుమారు 334 కోట్ల లీటర్లు) క్రూడాయిల్ సరఫరా అవుతుంది.
  • ప్రపంచ చమురు వినియోగంలో సుమారు 20శాతం ద్రవీకృత సహజ వాయువు (LNG)లో అధిక భాగం ఈ మార్గం గుండానే వెళుతుంది.
  •  1980లో ఇరాన్-ఇరాక్ యుద్ధ సమయంలో ఈ జలసంధిపై దాడి జరిగింది. ఆ ఫలితంగా రవాణాను రక్షించడానికి భారీ నౌకాదళ కాన్వాయ్‌లు చేపట్టబడ్డాయి.
    తాజా పరిస్థితి
  • అమెరికా-ఇజ్రాయెల్ దాడుల నేపథ్యంలో ఇరాన్ ఈ మార్గాన్ని మూసివేసింది. నౌకా రవాణాను పరిమితం చేసింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలకు రెక్కలొచ్చాయి. ఈ క్రమంలో మార్గాన్ని పునరుద్ధరించాలని అంతర్జాతీయంగా పలు దేశాల నుంచి డిమాండ్లు వెల్లువెత్తాయి.
  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపి తీవ్రమైన ద్రవ్యోల్బణం దిశగా సాగుతోంది.

ఈ ఐపీఎల్ లో వీరు చాలా హాట్ గురూ..

ఐపీఎల్ వచ్చేసింది. మరో వారం రోజుల్లో కొత్త సీజన్ షురూ కాబోతుంది. ఇప్పటికే ఆయా జట్లు సిద్ధమవుతున్నాయి. ఆటగాళ్లను ఏటా యాజమాన్యాలు వేలం ద్వారా కొనుగోలు చేయడం ఆనవాయితీ. ఇందులో భాగంగా ఈ సారి అత్యధిక రేటు పలికిన ఆటగాళ్లను ఓ సారి చూద్దామా మరి.
  • రిషబ్ పంత్(LSG) : కీపర్ కం బ్యాటర్. రూ.27 కోట్లకు లక్నో జట్టు కొనుగోలు చేసింది.
  • శ్రేయాస్ అయ్యర్(PBKS): ఆల్ రౌండర్. పంజాబ్ కింగ్స్ జట్టు రూ.26.75 కోట్లకు కైవసం చేసుకుంది.
  • కామెరన్ గ్రీన్(KKR): ఆల్ రౌండర్ అయిన గ్రీన్ ను రూ.25.20 కోట్లకు కోల్ కతా జట్టు కొనుగోలు చేసింది.
  • హెన్రిచ్ క్లాసిన్(SRH): బ్యాటర్, వికెట్ కీపర్. రూ.23కోట్లకు హైదరాబాద్ జట్టు కొనుగోలు చేసింది.
  • విరాట్ కోహ్లీ(RCB): కుడి చేతి బ్యాటర్. అత్యధిక ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉన్న క్రీడాకారుడు. బెంగళూరు జట్టు కింగ్ కోహ్లీని రూ.21కోట్లకు కొనుగోలు చేసింది.
  • మతీశ పతి రాణా(KKR): ఫాస్ట్ బౌలర్. ఈయన ను కోల్ కతా నైట్ రైడర్స్ రూ.18 కోట్లకు కొనుగోలు చేసింది.
  • రుతురాజ్ గైక్వాడ్ (CSK): రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన ఇతడిని రూ.18కోట్లకు చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.
  • సంజు శాంసన్ (RR): కీపర్, టాప్ ఆర్డర్ బ్యాటర్. ఇతడిని రాజస్థాన్ రాయల్స్ జట్టు రూ.18 కోట్లతో కొనుగోలు చేసింది.
  • రషీద్ ఖాన్ (GT): స్పిన్ బౌలర్ . ఈయనను గుజరాత్ టైటన్స్ జట్టు రూ.18 కోట్లతో కైవసం చేసుకుంది.
  • హార్దిక్ పాండ్యా (MI): ఆల్ రౌండర్ గా గుర్తింపు పొందిన హార్దిక్ ను రూ.16.35 కోట్లతో ముంబై ఇండియన్స్ జట్టు కొనుగోలు చేసింది.

తీపి..చేదుల బడ్జెట్

షడ్రుచుల పండుగ మరుసటి రోజు వచ్చిన బడ్జెట్ ఎవరిని ఎలా ఒప్పించింది..తన రుచులతో ఏ రంగాలను మెప్పించింది.. ఎవరికి తీపి.. చేదనిపించేదెవరికో.. చూసోద్దాం పదండి.

బూరెలివే..

  • ఇందిరమ్మ కుటుంబ బీమా..: రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సౌకర్యం. ఇది ఈ ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2)నుంచి అమలులోకి రానుంది.
  •  చేయూత పథకం ద్వారా కొత్తగా రెండు లక్షల నూతన పెన్షన్లు మంజూరు.
  •  ఐటీఐలు, ఏటీసీల్లో చేరే వారికి ఇకనుంచి నెలకు రెండువేల ఉపకార వేతనం.
  • బ్రేక్ ఫాస్ట్ : రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఇకనుంచి అల్పాహారంతో పలు అందనున్నాయి.
  • మధ్యాహ్న భోజనం: నూతన విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనున్నారు.
  • ఉద్యోగులు పెన్షనర్లకు నగదు రహిత వైద్యం: ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందించేందుకు 1,050 కోట్లు కేటాయింపు.
  • ప్రమాద బీమా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కోటి 20 లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
  • దివ్యాంగ విద్యార్థులకు మోటరైస్డ్ వాహనాల పంపిణీ.
  • యువతకు: వివిధ రంగాల్లో తగిన నైపుణ్య శిక్షణ అందించడానికి వివిధ దేశాల భాషను నేర్పించడానికి సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రామ్ ను కొత్తగా ప్రకటించింది.
  • అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన యంగ్ ఇండియా స్కూళ్లకు రూ.5కోట్లు కేటాయించింది.
  • చేదనిపించే..! 
  • గతంతో పోల్చితే చేనేత విభాగానికి కేటాయింపులు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరంలో 371 కోట్లు కేటాయించగా ఈసారి కేవలం రూ. 258 కోట్లతోనే సరిపెట్టారు.
  • ఈ బడ్జెట్ లో పింఛన్ పెంపు ఎంతో కొంత ఉంటుందని ఆశపడ్డ లబ్ధిదారులకు నిరాశే మిగిలింది.
  • 56% ఉన్న బీసీల జనాభాకు కేవలం రూ.12,511 కోట్లు(3.8 శాతం) కేటాయించడంపై ఆ వర్గాల నుంచి పెదవి విరుపు కనిపిస్తోంది.

సంక్షేమానికి పెద్దపీట..

తెలంగాణ బడ్జెట్ 2026-27ను అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క శుక్రవారం ప్రవేశపెట్టారు. సంక్షేమానికి పెద్దపీట వేస్తూ రూ.3.24,234 కోట్లతో భారీ పద్దును ప్రతిపాదించారు. గత బడ్జెట్‌ రూ.3,04,965 కోట్ల తో పోల్చితే ఇది 7.5శాతం అధికం. అలాగే మండలిలో మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి ప్రవేశపెట్టారు.

  • ఈ సారి ప్రత్యేకమివే
    రాష్ట్రంలోని అందరికీ ఇందిరమ్మ కుటుంబ బీమా.. జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం, ప్రీ ప్రైమరీ నుంచి ఇంటర్ వరకు విద్యార్థులందరికీ బ్రేక్ ఫాస్ట్.. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆరోగ్య భద్రత పథకం, ఐటిఐ, ఏటీసీల్లో చదివే విద్యార్థులకు నెలకు 2000 చొప్పున ఉపకార వేతనం వంటివి ఈసారి ప్రత్యేకంగా ఉన్నాయి.
  • మెజార్టీ కేటాయింపులు
    * ఆరు గ్యారెంటీలకు 50,713 కోట్లు
    * పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి: రూ. 33,688 కోట్లు
    * విద్యాశాఖ: రూ. 26,674 కోట్లు
    * వ్యవసాయ శాఖ: రూ. 23,179 కోట్లు
    * విద్యుత్ శాఖ: రూ. 21,285 కోట్లు
    * వైద్యారోగ్య శాఖ: రూ. 13,679 కోట్లు
    * ఎస్సీ సంక్షేమం: రూ. 11,784 కోట్లు
    * బీసీ సంక్షేమం: రూ. 12,511 కోట్లు
    * ఎస్టీ సంక్షేమం.. రూ.7,934 కోట్లు
    శాఖల వారీగా, ఇతర ప్రాధాన్యాలు..
    కార్మిక ; రూ.998 కోట్లు
    పౌరసరఫరాల: రూ.7,366 కోట్లు
    పశుసంవర్ధక:రూ.1,529 కోట్లు
    మహిళ, శిశు సంక్షేమ: రూ.3,143 కోట్లు
    పర్యాటక : రూ.1,224 కోట్లు
    మైనార్టీ .. రూ.3,769 కోట్లు
    యంగ్‌ ఇండియా స్కూళ్లు: రూ.5 వేల కోట్లు
    మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌: రూ.1,500 కోట్లు
    ఓయూకు: రూ.వెయ్యి కోట్లు
    ఉపకార వేతనాలు: రూ.4,343 కోట్లు
    వ్యవసాయ ఉత్పత్తులకు బోనస్‌: రూ.3500 కోట్లు
    ముఖ్య పథకాలకు
    ఇందిరమ్మ ఇళ్లు: రూ.5,500 కోట్లు
    రాజీవ్‌ ఆరోగ్యశ్రీ: రూ.1143 కోట్లు
    కల్యాణ లక్ష్మీ : రూ.3,683 కోట్లు
    మహాలక్ష్మీ: రూ.4,305 కోట్లు
    గృహజ్యోతి: రూ.2,080 కోట్లు
    చేయూత: రూ.14,861 కోట్లు
    మహాలక్ష్మీ గ్యాస్‌ సబ్సిడీ : రూ.723 కోట్లు
    రైతు భరోసా: రూ.18 వేల కోట్లు
    మెట్రో రైలు ఫేజ్‌-2: రూ.600 కోట్లు

పెట్రోల్ సెగ.. భగ్గుమన్న ‘ప్రీమియం’

0

పశ్చిమాసియా యుద్ధ సెగలు భారత్ కు తాకుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ ధర మంట మొదలైంది. గృహావసర సిలిండర్ ధర పెరగగా.. కమర్షియల్ కు పూర్తిగా బ్రేక్ పడింది. సామాన్యులకు బుకింగ్ ఇక్కట్లు మొదలవగా వ్యాపార, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రీమియం పెట్రోల్ వంతయింది.

  • లీటరుకు రూ.2.26 పెంపు
    * ప్రీమియం పెట్రోల్ దిగుమతి సరిపడా లేక ఆయిల్ కంపెనీలు ధర పెంచాయి. లీటర్ కు రూ.2.26 పెంచడంతో రూ.115 కు చేరువైంది. త్వరలోనే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
  • మూతపడుతున్న బంకులు
    * రాష్ట్ర రాజధానితో పాటు పలు ప్రాంతాల్లో బంకుల్లో స్టాక్ కొరత కనిపిస్తుంది. హైదరాబాద్ శివారులో చాలా చోట్ల దర్శనమిస్తుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. అందుబాటులో ఉన్నచోట ట్యాంక్ ఫుల్ చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

యుద్ధం..ఇంకెంతకాలం.. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయిల్ మధ్యలో ట్రంప్..

పశ్చిమాసియా..21 రోజులుగా యుద్ధంతో కంపిస్తుంది. క్షణక్షణం బాంబుల మోతతో మారుమోగుతోంది. ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు గాలిలో కలిశాయి. లక్షలాది మంది గాయాల పాలయ్యారు.. కోలుకోలేకుండా ఆస్తి నష్టమూ వాటిల్లింది. అయినా ఎవరూ వెనక్కి తగ్గట్లేదు. ట్రంప్ సహకారంతో దాడులకు పాల్పడుతున్న ఇజ్రాయిల్ ను ఇరాన్ అంతే దీటుగా ఎదుర్కొంటుంది.   అమెరికాకు మద్దతుగా వ్యవహరిస్తున్న గల్ఫ్ దేశాలపై భీకర దాడులు చేస్తూ సత్తా చాటుతోంది. అంతర్జాతీయ జల రవాణాలో కీలకమైన హోర్ముజ్ జల సంధిని మూసివేసి ప్రపంచ దేశాలకు షాక్ ఇచ్చింది.

  • ఫిబ్రవరి 28 నుంచి..
    2026 ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా జరిపిన వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ తో పాటు మరికొందరు కీలక అధికారులు మరణించారు. ఒకసారిగా రగిలిపోయిన ఇరాన్ అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు ప్రారంభించింది.
  • ఇప్పటివరకు 2500 మందికి పైగా మృతి..
    యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 2500 మంది మరణించినట్లుగా అధికారికంగా లెక్కలు చెబుతున్నా అనధికారికంగా ఈ మొత్తం దాదాపు 20 రెట్ల వరకు అధికంగా ఉండవచ్చని అంచనా. మృతులు ఎక్కువగా ఇరాన్, లేబనాన్ లలో ఉండడం గమనార్హం. మరోవైపు 13 మంది అమెరికన్ సైనికులు కూడా మరణించారని ఆ దేశ రక్షణ శాఖ తెలిపింది. ఇందులో భారతీయులు కూడా ఐదుగురు ఉన్నట్లుగా తెలిసింది
  • ప్రపంచంపై ప్రభావం..
    యుద్ధం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు పెరగడం, సరఫరా గొలుసులో ఆటంకాలు ఏర్పడటం వంటి ఆర్థిక సంక్షోభాలు మొదలయ్యాయి. భారత్ పై కూడా ఈ ప్రభావం చూపుతోంది.
  • ట్రంప్ కు షాక్ లు..
    * ఇరాన్‌తో యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ చీఫ్ జోసెఫ్ కెంట్ తన పదవికి తాజాగా రాజీనామా చేశారు.
    * స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ (straight of Hormuz)వద్ద అమెరికా యుద్ధనౌకలకు మద్దతుగా నిలవాలని ట్రంప్ చేసిన పిలుపును కెనడా, ఆస్ట్రేలియా వంటి సుమారు ఏడు మిత్రదేశాలు తిరస్కరించాయి.
    * యుద్ధం విషయంలో నాటో దేశాలు తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశాయి.
    * యుద్ధం కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగడం ట్రంప్ ప్రభుత్వానికి ఆర్థికంగా సవాలుగా మారింది.
    * ఇరాన్‌తో నెలకొన్న ప్రస్తుత పరిస్థితికి ట్రంప్ తీసుకున్న నిర్ణయాలే కారణమని అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతుండడం గమనార్హం
    * యుద్ధం కారణంగా ఈ నెలాఖరులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో జరగాల్సిన సమావేశాన్ని ట్రంప్ వాయిదా వేశారు.

అమెరికా.. వాళ్లకు ఆఫర్‌ ఇచ్చింది!

అగ్రరాజ్యం అమెరికా అక్రమ వలసదారులపై ఫోకస్‌ పెంచింది. వారిని తిరిగి తమ సొంత దేశాలకు పంపించే కార్యక్రమానికి ఏడాది క్రితమే శ్రీకారం చుట్టింది. తాజాగా మరో బంపర్‌ అఫర్‌ ప్రకటించింది. స్వచ్ఛందంగా యూఎస్ వీడే వారికి ఇచ్చే నగదును మరింత పెంచింది. ఉచిత విమాన ప్రయాణం సైతం కల్పిస్తామని ట్రంప్ సర్కార్ తాజాగా వెల్లడించింది.
గత ఏడాది నుంచే..
అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం, పత్రాలు లేని వలసదారులకు 2,600( సుమారు 2.4 లక్షల నగదు) డాలర్ల ఎగ్జిట్‌ బోనస్, స్వదేశానికి ఉచిత విమాన ప్రయాణాలను అందించే ‘ప్రాజెక్ట్ హోమ్‌కమింగ్’ అనే స్వచ్ఛంద స్వీయ-దేశ బహిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. 2025 జనవరి లో ప్రారంభించబడిన ఈ కార్యక్రమాన్ని సీబీపీ హోమ్ యాప్ ద్వారా చేపదుతోంది. క్రమబద్ధంగా దేశం విడిచి వెళ్లడాన్ని సులభతరం చేసే లక్ష్యంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని ఇప్పటివరకు సుమారు 22 లక్షల మందికి పైగా వినియోగించుకున్నారు. కాగా, అక్రమ వలసదారుల్లో భారతీయులు కూడా ఉన్నారు.
ప్రాజెక్ట్ ముఖ్య వివరాలు..

  • స్వచ్ఛందంగా అమెరికా విడిచి వెళ్లేందుకు నగదు ప్రోత్సాహకంగా 2,600 డాలర్లు అందిస్తారు.
  • ఇది అధికారిక బహిష్కరణకు సురక్షితమైన ప్రత్యామ్నాయం. తద్వారా అరెస్టు లేదా నిర్బంధాన్ని నివారించవచ్చు.
  • అక్రమ వలసదారులు తమ ఉద్దేశాన్ని నమోదు చేసుకోవడానికి, నిష్క్రమణను ప్లాన్ చేసుకోవడానికి, వ్యవహారాలు నిర్వహించుకోవడానికి సీబీపీ హోమ్ యాప్‌ ఉపయోగించవచ్చు.
  • బలవంతపు దేశ బహిష్కరణకు దాదాపు18,245 డాలర్లు ఖర్చు అవుతుండగా.. ఈ కార్యక్రమం ద్వారా ఒక్కోవ్యక్తి కి సుమారు 5,100 డాలర్ల మాత్రమే కానుంది.
    పత్రాలు లేని వ్యక్తులు ఆర్థిక సాయంతో క్రమబద్ధంగా, మానవతా దృక్పథంతో తమ ఇళ్లకు తిరిగి వెళ్లేందుకు ఈ కార్యక్రమం ఒక మార్గాన్ని కల్పిస్తోంది .

గుడ్‌ న్యూస్‌.. ఈపీఎఫ్ కనీస పింఛన్‌ త్వరలో పెరగుతుందట!

0

ఈపీఎఫ్ కనీస పింఛన్‌ పెరగనుందా.. అంటే అవుననే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కోట్లాది మందికి ఊరటనిచ్చే అంశమిది. రిటైర్‌మెంట్‌ తర్వాత చందాదారులు పొందే పింఛన్‌కు సంబంధించి పార్లమెంటరీ ప్యానెల్ కేంద్రానికి కీలక ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.వెయ్యి కనీస పెన్షన్ మొత్తాన్ని పెంచాలని కమిటీ సూచించింది. ఈ మేరకు నివేదికలో కీలక అంశాలను ప్రస్తావించింది.
ఇప్పటి వరకు ఉన్న కనీస పింఛన్‌ సరిపోవడం లేదంటూ, పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచాలంటూ పెన్షనర్లు ఏళ్లుగా ఆందోళన చేపడుతున్న విషయం విదితమే. ఇందులో భాగంగా దేశ రాజదానిలో ఇటీవల మూడు రోజుల పాటు ధర్నా సైతం చేపట్టారు. ఈ నేపథ్యంలో పార్లమెంటరీ స్థాయీ సంఘం స్పందించింది. మినిమమ్‌ పింఛన్‌పై పెన్షనర్ల నుంచి వినతులు వచ్చినట్లుగా పేర్కొంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇది ఏమాత్రం సరిపోదని అభిప్రాయపడింది. ఎంప్లాయీ పెన్షన్ స్కీమ్, 1995ని పునఃసమీక్షించాలని సూచించింది. ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.1,000గా ఉండగా.. దీనిని 2014లో చివరిసారిగా సవరించారు. తాజాగా రూ.7500లకు పెంచాలని కమిటీ ప్రతిపాదించింది. దీనిపై కేంద్రం త్వరలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 2026 బడ్జెట్‌లో లేదంటే రాబోయే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సమావేశాల్లో అధికారిక ప్రకటన వెలువడవచ్చు.
ప్రభుత్వ పరిశీలనలో..
పింఛన్‌ పెంపుపై ప్రభుత్వం పరిశీలనలో మూడు అంశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇందులో రూ.3,000, రూ.5,000 లేదా రూ.7,500కు పెంచాలనే ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.