Ai Skills Training | కరీంనగర్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్, IBM సర్టిఫికేషన్ వారి సహ కారంతో నిర్వహించిన నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమం శనివారం ముగిసింది. ఏఐ రంగంలో ఉపాధి అవకాశాలు, వ్యక్తిత్వ వికాసం,డిజిటల్ నైపుణ్యాలపై నిపుణులు అవగాహన కల్పించారు. శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న 55 మందికి బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ ఎం. రవి కుమార్ శనివారం సర్టిఫికెట్లు అందజేశారు. యువత ఇలాంటి శిక్షణ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో మంచి అవకాశాలను అందిపుచ్చుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్ ప్రతినిధులు శశాంక్ రెడ్డి మహేంద్ర రౌత్, బీసీ స్టడీ సర్కిల్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి.. ఇక బ్యాంకుల వంతు.. ఏఐ దెబ్బకు ఊడిపోనున్న ఉద్యోగాలు!




