Friday, March 13, 2026
spot_img
Home Blog

ఎల్లలు దాటిన అభిమానం.. కవితకు వినూత్నంగా బర్త్ డే విషెస్

0

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా శుక్రవారం ఉత్తర ప్రదేశ్ లోని మురాదాబాద్ లో జావేద్ మాలిక్ అనే కళాకారుడు బిల్డింగ్ టెర్రస్ పై గోధుమలతో బతుకమ్మ ఎత్తుకున్న కవిత భారీ పటాన్ని చిత్రించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన జాగృతి యువ నాయకులు మైలారం అరుణ్ రెడ్డి, కృష్ణారెడ్డి తమ అభిమాన అధినేత్రికి వినూత్నంగా ఇలా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

పరాభవ నామ సంవత్సరం ఎవరికి కలిసొచ్చెనో?

ఈ నెల 19న ఉగాది. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆరంభం కానుంది. ఈ ఏడాది రాశుల వారీగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దామా మరి.
ధనస్సు, మీనం వారు పట్టిందల్లా బంగారమే..
* ఈ ఏడాది ధనస్సు, మీనరాశుల వారికి పట్టిందల్లా బంగారం కానుంది. అదృష్టం వీరు వైపు ఎక్కువగా ఉంటుంది. ఆదాయం అత్యధికంగా (14) ఉండడమే కాకుండా.. రాజ్యపూజం కూడా ఉన్నత స్థితిలో ఉండనుంది. ఇక మేష, వృశ్చిక రాశుల వారికి ఆదాయం 11 ఉండనుంది. మిధునం కన్యారాశుల వారికి 8, అలాగే వృషభం తుల, సింహరాశుల వారికి 5 ఆదాయం పర్వాలేదనిపిస్తుండగా.. మకరం, కుంభం, కర్కాటకం వారికి కేవలం రెండు ఆదాయంతో చివరి స్థానంలో ఉండనున్నారు.
* వృషభం, తులా రాశుల వారికి అత్యధికంగా 14 వ్యయం ఉండడం గమనార్హం.
* సింహం, మీన రాశి వారికి రాజ్యపూజం ఏడుగా ఉండగా.. మిధునం, మకరం వారికి కేవలం ఒకటిగా ఉండడం విశేషం.
* అవమానం విషయానికి మిధునం,కర్కాటకం, మీనం వారికి అత్యధికంగా ఏడుగా కనిపిస్తుంది.

నేడు రైతుల ఖాతాల్లోకి ‘మోడీ’ పైసలు

రైతులకు శుభవార్త. కేంద్ర పెట్టుబడి సాయం నేడు అన్నదాతల ఖాతాల్లో జమ కానుంది. 22వ విడత పీఎం కిసాన్‌ నిధులను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. అస్సాం లోని గౌహతి నుంచి లబ్దిదారులకు డిబీటీ విధానం ద్వారా పంపిణీకి శ్రీకారం చుట్టనున్నారు. దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.18,640 కోట్లు జమ చేయనున్నారు. ఒక్కో రైతుకు రూ.2 వేల చొప్పున లబ్ధి చేకూరనుంది.
ఈ కేవైసీ తప్పనిసరి
రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ నమోదు చేసుకొని ఉండాలి. ఇందుకోసం పీఎం కిసాన్ పోర్టల్, మొబైల్ యాప్ లేదా సమీపంలోని సీఎస్సి కేంద్రాలను సంప్రదించాలి.

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇక ఒంటిపూట బడులు

ఎండాకాలం వచ్చేసింది. భానుడి భగభగలు మొదలయ్యాయి. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతాల్లో 40 డిగ్రీల సెల్సియస్ కు చేరువైంది. ఈ క్రమంలో విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పాఠశాలల వేళలు మార్చాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకుంది.
16 నుంచి షురూ..
రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా మార్చి 16 నుంచి ఏప్రిల్ 23 వరకు ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ఇప్పటికే ప్రకటించింది. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు కొనసాగుతాయి. సర్కారు బడులో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం 12:30 గంటలకు అందిస్తారు.

యుద్ధం ఎఫెక్ట్.. మళ్లీ వర్క్ ఫ్రమ్ హోమ్.. ప్రకటించిన పలు టెక్ కంపెనీలు

కరోనాలో మొదలైన వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రక్రియ తాజాగా మళ్లీ వినిపిస్తుంది. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ కొరత తలెత్తింది. భారత ప్రభుత్వం మాత్రం డొమెస్టిక్ కు ఎలాంటి ఇబ్బందులు ఉండకూండా చర్యలు చేపట్టింది. కమర్షియల్ పై మాత్రం ఆంక్షలు విధించింది. ఈ కారణంగా బెంగళూరు,ముంబై, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో ఇప్పటికే పలు హోటళ్లు మూతపడ్డాయి. క్యాంటీన్లలోనూ ఆహార పదార్థాలు అందుబాటులో ఉండని పరిస్థితి. దీంతో హెచ్ సిఎల్ తో పాటు పలు టేక్ కంపెనీలు వర్క్ ఫ్రం హోం ప్రకటించాయి. మరికొన్ని అదే బాటలో ఉన్నాయి.
ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన
సుదూర ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు సొంత ఊళ్ల బాట పట్టే అవకాశం ఉంది. పలువురు ఏర్పాట్లు కూడా చేసుకుంటున్నారు. కొందరు టెకీలు దీనిపై హర్షం వ్యక్తం చేస్తుండగా.. మరికొందరు మాత్రం వర్క్ బర్డెన్ పెరిగే అవకాశం ఉంటుందని పేర్కొనడం గమనార్హం.

బిగ్ అలర్ట్.. గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువు పెరిగిందండోయ్..

గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సిలిండర్ తీసుకున్న 21 రోజుల తర్వాత బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా.. తాజాగా 25 రోజులకు పెంచుతున్నట్లుగా వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో తాజా పరిస్థితులు, దేశంలో బ్లాక్ మార్కెట్ ను అరికట్టేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు గ్యాస్ సిలిండర్ల ఉత్పత్తిని పెంచాలని ఆయా కంపెనీలను కేంద్రం ఆదేశించింది. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది.

యథాతథంగా ఈపీఎఫ్‌ వడ్డీ రేటు.. 8.25 శాతంగా ఖరారు

ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ఈ ఆర్థిక సంవత్సరానికి (2025-26) కూడా 8.25 శాతం ఖరారు చేసింది ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ. సోమవారం నిర్వహించిన కీలక సమావేశంలో ఈపీఎఫ్‌వో ఈ నిర్ణయం తీసుకుంది. మూడేళ్లుగా కొనసాగుతున్న వడ్డీ రేటునే ఈ సారి కూడా ఖరారు చేసింది. ప్రభుత్వం అనుమతించిన వెంటనే ఏడు కోట్ల మంది చందాదారుల ఖాతాల్లో ఈ మొత్తం జమ కానుంది. అయితే ఈ సారి పెంపు ఉంటుందని అంతా భావించారు. ఎలాంటి పురోగతి లేకపోవడంతో ఒకింత నిరాశకు గురయ్యారు. గడిచిన మూడేళ్లుగా వడ్డీ రేట్లు పరిశీలించినట్లయితే.. 2022-23 సంవత్సరానికి గాను 8.15 శాతం ఉండగా 2023-24, 2024-25, 2025-26 సంవత్సరాలకు 8.25శాతంగా ఉండడం గమనార్హం.

ఇక పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెరుగుతాయా.. యుద్ధం ప్రభావం మనపై ఎలా ఉంటుంది.

భారత్‌లో కొద్ది రోజులుగా పెట్రో ధరలు స్థిరంగా ఉన్నాయి. తాజాగా పశ్చిమాసియాలో యుద్ద వాతావరణం మొదలవడంతో ఇక అందరి దృష్టి ఇంధన ధరలపై పడింది. ఇప్పటికే యూరప్ లో పెట్రో ధరలపై ప్రభావం పడింది. స్వల్ప వ్యవధిలోనే 50 శాతం వరకు పెరిగాయి. మరోవైపు ఇరాన్- దుబాయ్- ఒమన్ దేశాలం మధ్య గల్ హార్మూజ్ జలసంధి మూతపడింది. అంతర్జాతీయ రవాణాకు కీలకమైన ఈ జల సంధి మూసివేతతో భారత తదితర దేశాలపై ప్రభావం పడనుంది. ఇప్పటికే క్రూడ్ ఆయిల్ సరఫరా నిలిచిపోయింది.
నిండుకుంటున్న నిల్వలు
ఇరాన్ ప్రతీకార చర్యల్లో భాగంగా గల్ఫ్ దేశాల ఆయిల్ నౌకలపై దాడులు ముమ్మరం చేసింది. ఇది క్రూడ్ ఆయిల్ సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఓవైపు భారత్ లోనూ ఇంధన నిల్వలు నిండుకుంటున్నాయి.ప్రత్యామ్నాయ చర్యలపై ఇండియా దృష్టి సారిస్తుంది. అయితే రవాణా భారం ఎక్కువ అవుతున్న క్రమంలో ధరలపై ప్రభావం చూపే అవకాశం కనిపిస్తుంది.
భారీగా పెరగనున్నాయా..
క్రూడ్ ఆయిల్ ధరలు అంతర్జాతీయంగా భగ్గుమంటున్నాయి. మార్చి తోపాటు ఏప్రిల్‌ కాంట్రాక్ట్‌ బ్యారెల్‌కు 10 శాతం పెరుగుదల ఉంటున్నట్లుగా తెలుస్తుంది. బ్యారెల్‌కు ఒక డాలర్‌ పెరిగినా ఏడాదికి భారత్‌పై రూ.13 వేల కోట్ల భారం పడనున్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో మన దగ్గర కూడా కొద్ది రోజుల్లో మళ్లీ పెట్రో ధరలకు లెక్కలు రావడం ఖాయం అంటున్నారు నిపుణులు.

ఆరు కలిసొచ్చేనా.. ముహూర్తం ఫిక్స్ అయినట్లేనా.. కొత్త పార్టీ అదే రోజు ఆవిర్భవించేనా?

పిడికిలెత్తిన ఆ తిరుగుబావుటా.. ఉక్కు సంకల్పమై ఉరిమే సమయం ఆసన్నమైనట్లేనా.. గ్రహణం వీడిన ఆ ‘చంద్ర’ తనయ భగభగ మండే ఆ సూర్యుని సాక్షిగా ‘తెలంగాణ జాగృతి’గా ఉదయించబోతున్నారా.. కార్మికుల పండుగ రోజున పార్టీగా రాబోతున్నారా.. తన లక్కీ నంబర్ కలిసి వచ్చే ముహూర్తం ఖరారైనట్లేనా.. కవిత మదిలో ఏముందో మరి.
*******
ప్రపంచ కార్మికులు నినదించే రోజది. తెలంగాణ రాజకీయాల్లోనూ కీలకం కానుందా.. అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి తాజా పరిస్థితులు. జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటు వేయగా.. ఆమె దీటుగా స్పందించిన తీరు తెలిసిందే. రాజీనామా అస్త్రంతో పిడికిలెత్తిన ఆమె సభ్యత్వంతో పాటు పదవిని సైతం వీడారు. ఆ పార్టీ విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. ముఖ్యంగా హరీష్ రావును టార్గెట్ చేశారు. మరో వైపు జిల్లాల బాట పట్టి ప్రజా సమస్యలపై ఫోకస్ పెంచారు. పాలకుల తీరును ఎండగడుతూ జనం గొంతుకగా మారారు. ‘కారు’ కూతలను ఓవర్టేక్ చేస్తూ ఆత్మగౌరవం దక్కని ఉద్యమకారులకు తోడుగా.. పింఛన్ బాంచన్ అంటూ ఎదురుచూస్తున్న అవ్వలకు బిడ్డగా.. తెలంగాణ వచ్చినా కొలువులు దక్కక దగాపడ్డ నిరుద్యోగ అన్నలకు చెల్లెగా.. కష్టాల సాగులో కన్నీరు కారుస్తున్న అన్నదాతకు అండగా తానున్నానంటూ వేసిన ఒక్కో అడుగు పోరు పుస్తకంలో కొత్త పేజీలుగా మారాయి.
కడిగిన ముత్యంలా జనజాగృతి లోకి
నమ్మిన కర్మ సిద్ధాంతం.. న్యాయస్థానంలో దక్కిన ఊరట.. సత్యమేవ జయతే అంటూ వెల్లివిరిసిన ఆ ఆనంద క్షణాలు ఆమెలో మరింత పట్టుదలను బిగించాయి. శుక్రవారం కోర్టు తీర్పు దేశమంతా మారుమోగింది. రాజకీయ కక్షగా పట్టిన గ్రహణం వీడినట్లయింది. కుటుంబం దూరమైనా ఎల్లలెరుగని సబ్బండ వర్గాల నుంచి వచ్చిన ఆత్మీయ అభినందనలు వెయ్యి ఏనుగుల బలనిచ్చాయి. హితులు, సన్నిహితుల నుంచి వచ్చిన ఆ స్పందన ఆనంద బాష్పమైంది. యాదృచ్ఛికమైన ఆమె జైలుకు వెళ్లి తిరిగి వచ్చిన రోజు ఆగస్టు 27కాగా కోర్టు తీర్పు ఫిబ్రవరి 27 కావడం విశేషం.
చారిత్రాత్మక రోజు.. చరిత్ర సృష్టించ బోతున్నారా
కేసీఆర్ తో పాటు కవిత లక్కీ నెంబర్ కూడా ఆరు. పార్టీ అనౌన్స్మెంట్ కూడా అదే రోజు ఉంటుందనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే జాగృతి అధ్యక్షురాలు మే మొదటి వారంలో కీలక ప్రకటన ఉంటుందని వెల్లడించిన నేపథ్యంలో కార్మికుల దినోత్సవం అయిన ఒకటో తారీకు ప్రాధాన్యత సంతరించుకుంది. (1+5=6) కాగా ఆరోజున శుభ ముహూర్తం కూడా ఉండడం గమనార్హం.

‘క’దిలే.. ‘వి’రాటంలో.. ‘త’పోవనమై

జై తెలంగాణ.. అని గర్జించిన ఆ ఉద్యమ గొంతుకలు పునరాలోచనలో పడ్డాయి. స్వరాష్ట్ర సాధనతో సంబురపడ్డ ఆ గుండెలకు పుష్కర కాలమైనా ఆశించిన ఆత్మగౌరవం దక్కక అల్లాడుతున్నాయి. పరాయి పాలనలో ఈసడింపులకు గురై.. అవమానాలు ఎదుర్కొన్న ఆ పోరుబిడ్డల త్యాగాలు చరిత్ర కెక్కినా.. పాలకుల మది నుంచి మాత్రం కనుమరుగయ్యాయి. ఆ తల్లుల గర్భశోకం.. ఉద్యమ సిం’దూరమై’ న వీర వనితల ఆవేదన కనురెప్ప దాటగా.. ఇనుప కంచెలను ఛేదించి కటకటాల పాలైన త్యాగాల వారసులు ఎట్టకేలకు మౌనం వీడుతున్నారు. అమరుల ఆశయాలను ప్రశ్నించి ధిక్కార స్వరంతో రక్తబంధాన్ని తెంచుకున్న ఆ పిడికిలితో అడుగులేసేందుకు సిద్ధమవుతున్నారు.

వేదిక సిద్ధం.. తప్పదు యుద్ధం

రాష్ట్రం సిద్దించిన వెంటనే నేరుగా గన్ పార్క్ వెళ్లిన జాగృతి కవిత అమరులకు నివాళులర్పించి.. కుటుంబాలను ఓదార్చిన ఆ ఘట్టం కళ్ల ముందు కదులాడుతూనే ఉంది. తాజాగా అమరుల ఆశయ సాధనకు ఆమె వేసిన ముందడుగు ఉద్యమ నేతలను ఆలోచింపజేస్తోంది. స్వరాష్ట్రంలో ఉద్యమకారులకు జరిగిన అన్యాయాన్ని ఇటీవల ఆత్మగౌరవ సభలో ఎలుగెత్తారు. రామ్ జీ గోండు.. కొమురం భీమ్.. దొడ్డి కొమురయ్య , చాకలి ఐలమ్మ స్ఫూర్తిని కొనియాడుతూ.. 1969 ఉద్యమ వీరుల పోరాటాన్ని గుర్తు చేశారు. 2001లో కేసీఆర్ సారథ్యంలో మలిదశ లో పొరుబిడ్డల బలిదానాలు మారువలేనివని పేర్కొన్నారు. అయితే స్వరాష్ట్రంలో అవకాశాలు వచ్చిన వాళ్లే ఉద్యమకారులను అవమానించే పరిస్థితి రావడం బాధాకరమన్నారు. పరాయి పాలన నుంచి తెలంగాణ తల్లిని విముక్తి చేశాం. మన బానిసత్వాన్ని కూడా తెంచుకోవటానికి ముందడుగు వేద్దామని పిలుపునిచ్చారు. ఉద్యమకారుల అజెండాతోనే తమ పార్టీ ముందుకు పోతుందని స్పష్టం చేశారు.

డిమాండ్లు..
* ప్రతీ ఉద్యమకారుడికి నెలకు రూ. 25వేల పెన్షన్ అందించాలి.
* ఉద్యమకారులందరికీ 250 చదరపు అడుగుల ఇంటి స్థలం లేదా ఇళ్లు ఇవ్వాలి.
* రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన నిజమైన ఉద్యమకారులను గుర్తించి వారి సేవలను గౌరవించాలి.
* 1969, మలిదశ ఉద్యమాల్లో ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలను ఆదుకోవాలి.
* ఉద్యమ సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వారికి, నిరుద్యోగ యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి.
* ఉద్యమ కాలంలో పెట్టిన అన్ని కేసులు వెనక్కి తీసుకోవాలి.
* ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి.