Sunday, September 13, 2026

పెట్రోల్ సెగ.. భగ్గుమన్న ‘ప్రీమియం’

పశ్చిమాసియా యుద్ధ సెగలు భారత్ కు తాకుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ ధర మంట మొదలైంది. గృహావసర సిలిండర్ ధర పెరగగా.. కమర్షియల్ కు పూర్తిగా బ్రేక్ పడింది. సామాన్యులకు బుకింగ్ ఇక్కట్లు మొదలవగా వ్యాపార, వాణిజ్య రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా ప్రీమియం పెట్రోల్ వంతయింది.

  • లీటరుకు రూ.2.26 పెంపు
    * ప్రీమియం పెట్రోల్ దిగుమతి సరిపడా లేక ఆయిల్ కంపెనీలు ధర పెంచాయి. లీటర్ కు రూ.2.26 పెంచడంతో రూ.115 కు చేరువైంది. త్వరలోనే సాధారణ పెట్రోల్, డీజిల్ ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
  • మూతపడుతున్న బంకులు
    * రాష్ట్ర రాజధానితో పాటు పలు ప్రాంతాల్లో బంకుల్లో స్టాక్ కొరత కనిపిస్తుంది. హైదరాబాద్ శివారులో చాలా చోట్ల దర్శనమిస్తుంది. ఈ నేపథ్యంలో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. అందుబాటులో ఉన్నచోట ట్యాంక్ ఫుల్ చేయించుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

Hot Topics

Related Articles