Wednesday, May 13, 2026
spot_img

Bjp focus telangana | ‘కమలం’ నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ.. రంగంలోకి మోదీ

Bjp focus telangana | ఉత్తరాదిన వరుస విజయాల బాట పట్టిన బీజేపీ (Bjp) ఇక దక్షిణాదిపై ఫోకస్ పెంచింది. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో మూడింటిని కైవసం చేసుకున్న ఆ పార్టీ.. ఏకంగా మమత కంచుకోటను బద్దలుకొట్టింది. బెంగాల్ లో తొలిసారిగా అడుగుపెట్టి కాషాయ జెండాను రెపరెపలాడించింది. ఇదే ఊపులో తెలంగాణపై ఫోకస్ పెంచింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పాగా వేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటుంది.
మోదీ సభతో శ్రీకారం
ఈనెల 10న హైదరాబాద్‌లో ప్ర‌ధాని మోడీ సభను కాషాయ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బూత్ స్థాయిలో “కమలం” బ‌లోపేత‌మే లక్ష్యంగా శ్రేణుల‌ను స‌న్న‌ద్ధం చేయాల‌ని అధినాయ‌క‌త్వం భావిస్తోంది. ప్ర‌ధానంగా ఈ స‌భ ద్వారా వారిలో జోష్ నింపేందుకు స‌న్న‌ద్ధ‌మ‌వుతోంది. మ‌రోవైపు బెంగాల్‌ విజయంలో కీల‌క పాత్ర వ‌హించిన టీంకు తెలంగాణ బాధ్యతలు అప్పగించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తుంది.
గ్రూపుల‌కు చెక్ పెట్టేలా..
రాష్ట్రంలో గ‌త ఎన్నిక‌ల్లో స‌గం ఎంపీ సీట్ల‌ను కైవ‌సం చేసుకున్న పార్టీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ ఆ స్థాయిలో ఎందుకు సాధించ‌లేము.. అనే దానిపై కమలం అధిష్టానం ప్ర‌ధానంగా దృష్టి సారిస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. ఉత్త‌ర తెలంగాణ‌లో బ‌లంగా క‌నిపిస్తున్న పార్టీ మిగ‌తా చోట్ల పుంజుకోక‌పోవ‌డానికి కార‌ణాలను అన్వేషిస్తోంది. నిత్యం త‌ల‌నొప్పిగా మారిన గ్రూపు త‌గాదాలపై ఫోక‌స్ పెంచి రాష్ట్ర, జిల్లాల నాయ‌క‌త్వాన్ని స‌మ‌న్వ‌య‌ప‌రిచే దిశ‌గా ఫోక‌స్ పెంచుతున్నట్లుగా తెలుస్తోంది.
రేవంత్ స‌ర్కారు వైఫ‌ల్యాల‌పై ఫోక‌స్‌..
ప్ర‌ధానంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ స‌ర్కారు లక్ష్యంగా పావులు క‌ద‌పాల‌ని అధిష్టానం భావిస్తోంది. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై ఫోక‌స్ పెంచ‌డంతో పాటు కేంద్ర ప‌థ‌కాల‌ను క్షేత్ర‌స్థాయిలోకి తీసుకెళ్లాల‌ని యోచిస్తోంది. ప్ర‌ధానంగా ప్ర‌జ‌ల్లో డ‌బుల్ ఇంజిన్‌ (Double engine) స‌ర్కారు ఆలోచ‌న రావాల‌నే లక్ష్యంతో ముందుకు సాగేలా వ్యూహాల‌ను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా తొలుత మోడీ స‌భ స‌క్సెస్‌పై దృష్టి సారిస్తోంది.

ఇది కూడా చ‌ద‌వండి… ఆ ‘విజయం’ ఎందరికో రాజకీయ పాఠం..

spot_img

Hot Topics

Related Articles