Tuesday, June 23, 2026

Ias rinkusingh | పని లేకుంటే జీతం తీసుకోలేను.. రాజీనామా ఆమోదించండి.. రాష్ట్రపతికి ఓ ఐఏఎస్ నివేదన!

Ias rinkusingh | స‌ర్కారు కొలువంటే ఆషామాషీ కాదు.. అదీ సివిల్స్ అయితే చెప్ప‌న‌క్క‌ర లేదు.. ఏళ్ల పాటు పుస్త‌కాల‌తో య‌జ్ఞం చేయాల్సిందే. ఎన్నో వ‌డ‌పోత‌ల త‌ర్వాత కానీ నెర‌వేర‌దు ఆ క‌ల. అలాంటి ఉన్న‌తోద్యోగాన్ని సైతం త‌న‌కు వ‌ద్దంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు ఈ యువ ఐఏఎస్‌. తాను విధులు నిర్వ‌హించ‌కుండా వేత‌నం తీసుకోలేనంటూ జాబ్‌కే రాజీనామా చేశాడు. ఆమోదించాలంటూ ఏకంగా రాష్ట్ర‌ప‌తికి లేఖ రాసి దేశ‌వ్యాప్తంగా సంచ‌ల‌నంగా మారాడు. ఆయ‌నే యూపీ కేడ‌ర్ కు చెందిన యువ ఐఏఎస్ రింకూసింగ్ రాహి.

అసలేం జరిగిందంటే..

  • 2023 బ్యాచ్‌కు చెందిన ఈయ‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని షాజాహాన్‌పూర్ జిల్లా పువాయా ప‌ట్ట‌ణ సబ్ కలెక్టర్ గా ఏడాది క్రితం నియామకమయ్యారు. ఈ క్రమంలో ఒక లాయర్ రోడ్డుపై మూత్ర విసర్జన చేస్తుండగా అతడిని గుంజీలు తీయించారు. న్యాయవాదులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఆయన కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఆయన వారిని పిలిచి మాట్లాడారు. అయితే నగరంలో పారిశుద్ధ్యంతోపాటు టాయిలెట్ల నిర్వహణ సరిగా లేదనివారు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏకీభవించిన ఆయన బాధ్యత వహిస్తూ వారి ముందు స్వయంగా గుంజీలు తీయడం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో అతడిని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూబోర్డుకు అటాచ్ చేసింది.

ఎనిమిది నెల‌లుగా పోస్టింగ్ లేదు..

  • ఈ క్రమంలో 8 నెలలుగా పోస్టింగ్ లేదు. విధులు లేకపోవడంతో తాను వేతనం తీసుకోవడం సరికాదని భావించిన ఆయన రాజీనామాకు ఉపక్రమించారు. లేఖను రాష్ట్రపతికి నివేదించారు.సీనియ‌ర్ ఉన్నతాధికారు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు.మరోవైపు విషయాన్ని ఆలీఘడ్ లో ఆయన కుటుంబం బుధవారం మీడియా ఎదుట వెల్లడించింది. నిజాయితీ గల అధికారికి న్యాయం చేయాలని కోరింది.
  • స్ట్రిక్ట్ ఆఫీసర్ గా పేరు
  • ఈయిన గతంలో ముజఫర్ నగర్ లో సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా పని చేశారు. ఆ సమయంలో భారీ కుంభకోణాన్ని బయట పెట్టారు. దీంతో అతనిపై దాడి కూడా జరిగింది. అయినా అదే పంథా కొనసాగిస్తూ తన మార్కును చూపుతుండడం గమనార్హం.

Hot Topics

Related Articles