Wednesday, April 15, 2026
spot_img

US-Iran talks | రెండో విడత చర్చలకు సిద్ధమా.. ఈసారి వేదిక జెనీవానా..?

US-Iran talks | పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఇటీవల పాకిస్తాన్ వేదికగా అమెరికా(america), ఇరాన్(iran) మధ్య జరిగిన చర్చలు విఫలమైన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి చర్చలకు సిద్ధమని రెండు దేశాల నుంచి సంకేతాలు అందుతున్నాయి. అయితే ఈసారి వేదిక మారనున్నట్టుగా తెలుస్తుంది.
ఈ నెల 21వరకు సీజ్ ఫైర్

ఫిబ్రవరి 28 నుంచి ఏప్రిల్ 8 వరకు 39 రోజుల యుద్ధం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు దేశాలు చర్చలను స్వాగతిస్తూ రెండు వారాల పాటు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఈ సీజ్ ఫైర్ కు ఈ నెల 21వరకు గడువు ఉంది. అప్పటివరకు మరోసారి చర్చలు జరిపేందుకు అటు వైట్ హౌస్ నుంచి.. ఇటు ఇరాన్ నుంచి తాజాగా సానుకూల సంకేతాలు వస్తున్నాయి. ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినా ఇరాన్ కండిషన్స్ అప్లైగా పేర్కొంటుడడం గమనార్హం.
వేదిక మారనుందా..
తొలి విడత చర్చలకు సంబంధించి పాక్ వైఖరి పై ఇరాన్ కొంత గుర్రుగా ఉన్నట్లుగా తెలుస్తుంది. అమెరికా వ్యూహంలో భాగంగా పాక్ వ్యవహరిస్తుందంటూ చర్చల అనంతరం ఆ దేశ డెలిగేట్స్ ఇచ్చిన లీకుల ఆధారంగా బయటకు వచ్చింది. ఈ క్రమంలో కొంత శాంతి ప్రదేశంగా పేరున్న జెనీవా వేదికను పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు చైనా, రష్యా, ఇండియా కూడా మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా అణు కార్యక్రమం, హోర్ముజ్ జల సంధి పీఠముడిగా ఉన్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇజ్రాయిల్ కూడా ఈసారి చర్చల్లో తప్పనిసరిగా ఉండాలని ఇరాన్ పట్టుబడుతుంది. అయితే తదుపరి చర్చలు ఎక్కడ ఉంటాయి.. ఈసారి ట్రంప్ కూడా ప్రత్యక్షంగా పాల్గొంటాడా అనేది ఆసక్తికరంగా మారింది.

ఇది కూడా చదవండి : హోర్ముజ్.. ‘సంధి’ చిన్నది.. రవాణా పెద్దది

spot_img

Hot Topics

Related Articles