తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా శుక్రవారం ఉత్తర ప్రదేశ్ లోని మురాదాబాద్ లో జావేద్ మాలిక్ అనే కళాకారుడు బిల్డింగ్ టెర్రస్ పై గోధుమలతో బతుకమ్మ ఎత్తుకున్న కవిత భారీ పటాన్ని చిత్రించారు. నిజామాబాద్ జిల్లాకు చెందిన జాగృతి యువ నాయకులు మైలారం అరుణ్ రెడ్డి, కృష్ణారెడ్డి తమ అభిమాన అధినేత్రికి వినూత్నంగా ఇలా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.



