Tuesday, June 9, 2026

Fee regulation act | ఫీజుల నియంత్రణ చట్టం కోసం.. టీఆర్ఎస్ పోరుబాట

  • స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ముట్టడి
  • వందలాది కార్యకర్తల అరెస్ట్

Fee regulation act | కార్పొరేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టేందుకు తెలంగాణ రక్షణ సేన (TRS) పోరుబాట పట్టింది. ప్రభుత్వం వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేస్తూ మంగళవారం ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు లక్డీకాపూల్ లోని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ను ముట్టడించారు. గంటకు పైగా గేట్ ఎదుట బైఠాయించారు. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్రంలోని ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ ఒక్కసారిగా వంద నుంచి 150 శాతం వరకు ఫీజులు పెంచి విద్యార్థుల తల్లిదండ్రులపై పెను భారం మోపాయని.. అయినా ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అండతోనే కార్పొరేట్ యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులను జలగల్లా పీక్కుతింటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలన్నారు. ఫీజు రీయింబర్స్ మెంట్ పథకానికి మంగళం పాడేందుకు తీసుకువచ్చిన జీవో నం.7ను వెంటనే రద్దు చేయాలని, రూ.11వేల కోట్ల రీయింబర్స్ మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తీవ్ర ఉద్రిక్తత
వందలాది మంది నాయకులు, కార్యకర్తలు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టరేట్ ను ముట్టడించడంతో లక్డీకాపూల్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళన చేస్తున్న నాయకులను పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయడంతో వారు ఆఫీస్ గేట్లు ఎక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించారు. ఈక్రమంలో సీఎం, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీఆర్ఎస్ ఆందోళనతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి నాంపల్లి, నారాయణగూడ, సైఫాబాద్, బండ్లగూడ, గోషామహల్ పోలీస్ స్టేషన్ లకు తరలించారు. అరెస్ట్ చేసే క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు మహిళా నాయకులు గాయపడ్డారు.

ఇది కూడా చ‌ద‌వండి… ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ కు వేళాయె

Hot Topics

Related Articles