షడ్రుచుల పండుగ మరుసటి రోజు వచ్చిన బడ్జెట్ ఎవరిని ఎలా ఒప్పించింది..తన రుచులతో ఏ రంగాలను మెప్పించింది.. ఎవరికి తీపి.. చేదనిపించేదెవరికో.. చూసోద్దాం పదండి.
బూరెలివే..
- ఇందిరమ్మ కుటుంబ బీమా..: రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల బీమా సౌకర్యం. ఇది ఈ ఏడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం (జూన్ 2)నుంచి అమలులోకి రానుంది.
- చేయూత పథకం ద్వారా కొత్తగా రెండు లక్షల నూతన పెన్షన్లు మంజూరు.
- ఐటీఐలు, ఏటీసీల్లో చేరే వారికి ఇకనుంచి నెలకు రెండువేల ఉపకార వేతనం.
- బ్రేక్ ఫాస్ట్ : రీ ప్రైమరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు ఇకనుంచి అల్పాహారంతో పలు అందనున్నాయి.
- మధ్యాహ్న భోజనం: నూతన విద్యా సంవత్సరం నుంచి జూనియర్ కళాశాల విద్యార్థులకు కూడా మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయనున్నారు.
- ఉద్యోగులు పెన్షనర్లకు నగదు రహిత వైద్యం: ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు నగదు రహిత వైద్యం అందించేందుకు 1,050 కోట్లు కేటాయింపు.
- ప్రమాద బీమా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు కోటి 20 లక్షల బీమా సదుపాయం కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
- దివ్యాంగ విద్యార్థులకు మోటరైస్డ్ వాహనాల పంపిణీ.
- యువతకు: వివిధ రంగాల్లో తగిన నైపుణ్య శిక్షణ అందించడానికి వివిధ దేశాల భాషను నేర్పించడానికి సీఎం ఓవర్సీస్ ఎంప్లాయిమెంట్ ప్రోగ్రామ్ ను కొత్తగా ప్రకటించింది.
- అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన యంగ్ ఇండియా స్కూళ్లకు రూ.5కోట్లు కేటాయించింది.
- చేదనిపించే..!
- గతంతో పోల్చితే చేనేత విభాగానికి కేటాయింపులు తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరంలో 371 కోట్లు కేటాయించగా ఈసారి కేవలం రూ. 258 కోట్లతోనే సరిపెట్టారు.
- ఈ బడ్జెట్ లో పింఛన్ పెంపు ఎంతో కొంత ఉంటుందని ఆశపడ్డ లబ్ధిదారులకు నిరాశే మిగిలింది.
- 56% ఉన్న బీసీల జనాభాకు కేవలం రూ.12,511 కోట్లు(3.8 శాతం) కేటాయించడంపై ఆ వర్గాల నుంచి పెదవి విరుపు కనిపిస్తోంది.




