assembly and parliament Seats are increasing..
రానున్న ఎన్నికల్లో ఎంపీ, ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నారా.. అయితే మీకో శుభవార్త.. పార్లమెంట్, అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు ప్రవేశపెట్టాలని సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ప్రస్తుతం ఉన్న లోక్ సభ స్థానాలు 543 నుంచి 816కు పెరగనున్నాయి. అలాగే దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ స్థానాలు 4,123 నుంచి 6185కు పెరగనున్నట్లు తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
- తెలంగాణలో ప్రస్తుతం17 లోకసభ స్థానాలు ఉండగా కొత్తగా మరో తొమ్మిది పెరగనున్నాయి. వీటితో కలిపి 26కు చేరే అవకాశం ఉంది. ఇక అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న 119 స్థానాలకు మరో 60 జతకానున్నాయి. దీంతో మొత్తం 179కి పెరగనున్నాయి.
- ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.. ఇక్కడ లోక్సభ స్థానాలు ప్రస్తుతం 25 ఉన్నాయి. కొత్తగా 13 పెరిగే అవకాశం ఉంది. దీంతో మొత్తం స్థానాల సంఖ్య 38కి చేరనుంది. అసెంబ్లీ స్థానాల విషయానికి వస్తే ప్రస్తుతం 175 ఉండగా కొత్తగా మరో 85 పెరగనున్నాయి. వాటితో కలిపితే మొత్తం స్థానాలు 263కు చేరువకానున్నాయి.
వారిలో ఆశలు - ఇప్పటివరకు టికెట్ దక్కని వారు, పొలిటికల్ రంగప్రవేశం చేయాలనుకునేవారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. అయితే తాజా ప్రకటనతో అలాంటి వారిలో ఆశలు చిగురిస్తున్నాయి. అప్పుడే తమకు అనుకూలంగా ఉండే ప్రాంతాలపై ఫోకస్ పెడుతున్నారు. పార్టీల ముఖ్య నేతల టచ్ లోకి వెళ్తున్నారు. ఈసారి తమను తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలని విన్నవించుకుంటున్నారు. స్థానాలు పెరిగితే ఒక్క అవకాశం కల్పించాలని కోరుతున్నారు.




