Thursday, April 9, 2026
spot_img

results | ఆ రిజల్ట్స్ ఎప్పుడంటే..

results | ఈ ఏడాది తెలంగాణలో ఇంటర్మీడియెట్ పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎదురు చేస్తున్నారు. ఈ మేరకు బోర్డు కూడా ఏర్పాట్లను వేగవంతం చేసింది. శుక్రవారం విడుదల చేయనున్నట్లు తెలిసింది.
9.97 లక్షల మంది..
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు కొనసాగిన విషయం తెలిసిందే. మొత్తం 9 లక్షల 97 వేల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పటికే వాల్యుయేషన్ ప్రక్రియ కూడా పూర్తయింది. కేవలం ఒక సబ్జెక్టు మాత్రమే ఫెయిల్ అయిన వారి పేపర్లను అధికారులు మరోసారి క్రాస్ చెక్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈనెల 10న ఫలితాలను విడుదల చేసేందుకు బోర్డు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
జెఈఈ మెయిన్స్
దేశవ్యాప్తంగా రెండో విడత(session 2) జేఈఈ మెయిన్స్ పరీక్షలను ఎన్టీఏ ఈ నెల 2 నుంచి 8 వరకు నిర్వహించింది. సుమారు 11.23 లక్షల మంది ఈ పరీక్షలకు హాజరయ్యారు. ఈ నెల 11 లేదా 12న కీ విడుదల కానుంది. ఈ నెల 18 నుంచి 20 మధ్యలో ఫలితాలు వెల్లడి కానున్నట్లు సమాచారం. ఈ నెల 23 నుంచి అడ్వాన్స్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లుగా ఎన్టీఏ తన వెబ్సైట్లో పేర్కొంది.

ఇది కూడా చదవండి :  అవునండీ.. యుద్ధానికి బ్రేక్.. కండిషన్స్‌ అప్లై!

spot_img

Hot Topics

Related Articles