చేతులు జోడించి చెబుతున్నా.. దయచేసి ఆ నూనెలు.. చక్కెర వాడకండి.. ఓ డాక్టర్ ఆవేదన
- తన దగ్గరకు వచ్చిన పేషంట్లతో ఓ డాక్టర్ కన్నీటి పర్యంతమైన ఘటన ఇది. ఆరోగ్యానికి హాని చేసే రిఫండ్ ఆయిల్, చక్కెర వంటివి వాడకూడదని క్యాన్సర్ వంటి రోగాలను కొనితెచ్చుకోవద్దంటూ చేతులు జోడించి చెప్పిన వైద్యుని గురించి ఓ సారి తెలుసుకుందాం పదండి.
ఎక్కడంటే..
* కరీంనగర్ లోని టైం న్యూరో కేర్ కు చెందిన వైద్యుడు విక్రమ్ సింగ్ ఠాకూర్ తన వద్దకు వచ్చిన పేషంట్లతో ఇటీవల కాసేపు ముచ్చటించాడు. ఈ క్రమంలో రిఫండ్ ఆయిల్,షుగర్ వాడకంతో వచ్చే దుష్పరిణామాలను వివరించాడు. తాను చూసిన పేషెంట్స్ లో ఎక్కువగా కనిపించిన సమస్యలను వారి ముందు ఉంచాడు. ఆ కష్టాలు పగవారికి కూడా రావొద్దంటూ ఒక్కసారిగా భావోద్వేగానికి గురి అయ్యాడు. కన్నీటిని ఆపుకోలేకపోయాడు. ఇకనైనా ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పై శ్రద్ద వహించాలన్నాడు. గానుగ నూనె , నెయ్యి వాడాలని.. పిల్లలకు బిస్కెట్లు చాక్లెట్లు, ఫోన్లు ఇవ్వవద్దని.. బయట ఫుడ్ కు దూరంగా ఉండాలని సూచనలిచ్చాడు. అలాగే ఎప్పుడూ తినడం కూడా ఓ రోగమని అందుకే పొట్టలు వస్తున్నయని.. మిత ఆహారం శ్రేయస్కరమని పేర్కొన్నాడు.
- సోషల్ మీడియాలో చక్కర్లు..
* ఆరోగ్యం పై అప్రమత్తంగా ఉండాలంటూ ఈ వైద్యుడి సూచనలతో కూడిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.