గ్యాస్ సిలిండర్ బుకింగ్ గడువును పెంచుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సిలిండర్ తీసుకున్న 21 రోజుల తర్వాత బుకింగ్ చేసుకునే అవకాశం ఉండగా.. తాజాగా 25 రోజులకు పెంచుతున్నట్లుగా వెల్లడించింది. అంతర్జాతీయ మార్కెట్లో తాజా పరిస్థితులు, దేశంలో బ్లాక్ మార్కెట్ ను అరికట్టేందుకుగాను ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు గ్యాస్ సిలిండర్ల ఉత్పత్తిని పెంచాలని ఆయా కంపెనీలను కేంద్రం ఆదేశించింది. గృహ అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేసింది.



