ఈ నెల 19న ఉగాది. శ్రీ పరాభవ నామ సంవత్సరం ఆరంభం కానుంది. ఈ ఏడాది రాశుల వారీగా ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు ఎలా ఉన్నాయో చూద్దామా మరి.
ధనస్సు, మీనం వారు పట్టిందల్లా బంగారమే..
* ఈ ఏడాది ధనస్సు, మీనరాశుల వారికి పట్టిందల్లా బంగారం కానుంది. అదృష్టం వీరు వైపు ఎక్కువగా ఉంటుంది. ఆదాయం అత్యధికంగా (14) ఉండడమే కాకుండా.. రాజ్యపూజం కూడా ఉన్నత స్థితిలో ఉండనుంది. ఇక మేష, వృశ్చిక రాశుల వారికి ఆదాయం 11 ఉండనుంది. మిధునం కన్యారాశుల వారికి 8, అలాగే వృషభం తుల, సింహరాశుల వారికి 5 ఆదాయం పర్వాలేదనిపిస్తుండగా.. మకరం, కుంభం, కర్కాటకం వారికి కేవలం రెండు ఆదాయంతో చివరి స్థానంలో ఉండనున్నారు.
* వృషభం, తులా రాశుల వారికి అత్యధికంగా 14 వ్యయం ఉండడం గమనార్హం.
* సింహం, మీన రాశి వారికి రాజ్యపూజం ఏడుగా ఉండగా.. మిధునం, మకరం వారికి కేవలం ఒకటిగా ఉండడం విశేషం.
* అవమానం విషయానికి మిధునం,కర్కాటకం, మీనం వారికి అత్యధికంగా ఏడుగా కనిపిస్తుంది.




